దాదాపు 80 శాతం వరకు నీటిలో మునిగి రెండు గంటల పాటు వేద మంత్రాలను పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది భక్తులు హాజరయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండల కేంద్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.సకాలంలో వర్షాలు కురిసి.. పంటలు సమృద్ధిగా పండాలని.. ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ రామేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని నిర్వహించారు.