Headlines

ఏంట్రా బాబూ.. ఇంత సెన్సిటివ్ అయితే ఎట్లా.. పదో తరగతి విద్యార్థి బలవన్మరణం!


ఏంట్రా బాబూ.. ఇంత సెన్సిటివ్ అయితే ఎట్లా.. పదో తరగతి విద్యార్థి బలవన్మరణం!

హైదరాబాద్‌ మహానగరం మియాపూర్‌ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మియాపూర్‌ సుభాష్‌చంద్రబోస్‌ నగర్‌లో మల్లికార్జున తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతడి తండ్రి పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల చదువుపై ఒత్తిడి, చదువు సరిగా రావడం లేదనే ఆందోళనతో మల్లికార్జున మానసికంగా ఇబ్బందికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ ఊహించని విధంగా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనను గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మియాపూర్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులు, అతడి మానసిక స్థితి, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

చిన్న వయసులోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. చదువులో ఇబ్బందులు ఎదురైతే పిల్లలపై ఒత్తిడి పెంచకుండా, వారి సమస్యలను అర్థం చేసుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అండగా నిలవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని మియాపూర్‌ పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *