ధనియాలు మొలకెత్తించే సరికొత్త పద్ధతి: ముందుగా పుచ్చు పట్టని కొత్త ధనియాలను ఎంచుకోవాలి. ఈ ధనియాలను పగలగొట్టాల్సిన అవసరం లేకుండా నేరుగా నీటిలో వేసి 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక మందపాటి కాటన్ క్లాత్ తీసుకుని నానిన ధనియాలను అందులో వేసి లూజ్గా మూట కట్టాలి. మూట తడిసేలా నీళ్లు చల్లి గాలి, వెలుతురు తగిలే నీడ ప్రదేశంలో ఉంచాలి. రోజుకు ఒక్కసారి మూటపై నీళ్లు చిలకరిస్తుంటే చాలు.. కేవలం 3 నుండి 4 రోజుల్లోనే ప్రతి విత్తనం నుంచి బలమైన తెల్లని వేర్లు, లేత ఆకులు బయటకు వస్తాయి.