Headlines

డీజే సౌండే నా బిడ్డను బలి తీసుకుంది | Hyderabad Mother Blames Loud DJ Sound for Sons Tragic Death at Ganesh Festival – Viral Videos in Telugu


హైదరాబాద్‌లోని మూషీరాబాద్‌లో జరిగిన వినాయక ఉత్సవాలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. డీజే సౌండ్, భారీగా పోగైన జనసందోహం కారణంగా తన 22 ఏళ్ల కుమారుడు భద్రి ప్రాణాలు కోల్పోయాడని ఒక తల్లి కన్నీటిపర్యంతమైంది. తమ బిడ్డ బయటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే శవమై తిరిగి వచ్చాడని, తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తన కొడుకు అన్యాయంగా బలి అయ్యాడని ఆ తల్లి రోదించింది.తన కుమారుడి మరణానికి డీజేల విచ్చలవిడి వాడకం, నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. రాత్రి తొక్కులాటలు, ఊపిరాడకపోవటం వల్లనే భద్రి మృతి చెందాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటన గురించి పోలీసులను సంప్రదించినప్పుడు, మొదట తన కుమారుడికి చికిత్స అందిస్తున్నారని చెప్పారని, ఆ తర్వాత స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆమె వాపోయింది. ఇటువంటి విషాద ఘటనలు మరెవరికీ జరగకుండా పోలీసులు డీజే సిస్టమ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ తల్లి తీవ్రంగా డిమాండ్ చేసింది. భద్రి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడని, రాంనగర్‌లో తమ కుటుంబం నివసిస్తుందని ఆమె తెలిపింది. ఈ ఘటన పట్ల ఆమె వ్యక్తం చేసిన ఆవేదన పలువురిని కలచివేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం :

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *