దర్శకుడు రవి బాబు ఓ ఇంటర్వ్యూ తన కెరీర్లోని లోతైన అనుభవాలను, ముఖ్యంగా మనసారా పరాజయం వెనుక ఉన్న కష్టాన్ని, తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాకు కష్టపడతామని, కానీ ఫలితాలు వేరుగా ఉంటాయని ఆయన అన్నారు. మనసారా చిత్రం తనకు అత్యంత నిరాశపరిచిన వాటిలో ఒకటని, ఈ సినిమాను హీరో తండ్రి కోరిక మేరకు రూపొందించామని వివరించారు. హీరో భారీ పర్సనాలిటీ ఉన్నోడు కాదు, అతని శరీర భాషకు తగినట్లుగా కేరళ నేపథ్యం, కలరిప్పయట్టు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక యాక్షన్ కథను అనుకున్నామని రవి బాబు తెలిపారు. ఈ సినిమాను రూపొందించడానికి విపరీతంగా కష్టపడాల్సి వచ్చిందని, కేరళలో షూటింగ్, సెట్లు, అనుభవం లేని హీరోతో పని చేయడం సవాళ్లతో కూడుకున్నదని ఆయన గుర్తు చేసుకున్నారు.
Jabardasth Komaram: జబర్దస్త్లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా
చిత్రం విడుదలయ్యాక తాను బాగుందని భావించినప్పటికీ, అద్భుతమైన సంగీతం, పాటలు, అందమైన లొకేషన్లు ఉన్నప్పటికీ, సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదని రవి బాబు అన్నారు. వైజాగ్లో ఒక థియేటర్లో మాత్రమే 100 రోజులు ఆడిందని, మిగతా ఎక్కడా ఆడలేదని చెప్పారు. ఆశ్చర్యకరంగా, ఈ సినిమా ఉత్తమ యాక్షన్ చిత్రంగా నంది అవార్డును గెలుచుకుందని, ఇది తనను నిలబెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ దివ్యను తాను పరిచయం చేసిన తీరు గురించి మాట్లాడుతూ, ఆమె తన సహాయ దర్శకులలో ఒకరి సిఫార్సు మేరకు స్క్రీన్ టెస్ట్ కోసం వచ్చిందని చెప్పారు. తన దృష్టి స్క్రీన్ టెస్ట్ అవుతున్న మరో అమ్మాయిపై ఉన్నప్పుడు, బయట స్తంభానికి ఆనుకుని నిలబడి ఉన్న శ్రీ దివ్యను చూసి, ఆమెకు స్క్రీన్ టెస్ట్ చేయమని కోరానని అన్నారు.
మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా..
అలా ఆమెకు ఆ అవకాశం లభించిందని, అప్పటి నుండి వారిద్దరూ పెద్దగా కలుసుకోలేదని రవి బాబు తెలిపారు. చిత్ర పరిశ్రమలో అవకాశాలపై రవి బాబు మాట్లాడుతూ.. “ఎవరూ ఎవరికీ జీవితాన్ని ఇవ్వరు. అది వారి విధి. మన అవసరం కోసం మనం ఎదుటివారిని వాడుకుంటాం, దానివల్ల వారికి లబ్ధి చేకూరితే అది వారి అదృష్టం. మనం ఒక సాధనం లాగా వారికి ఉపయోగపడ్డాం అంతే” అని ఆయన అన్నారు. ఎవరూ ఎవరికీ “లిఫ్ట్” ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. చిత్ర నిర్మాణంలో స్పాట్ ఇంప్రూవైజేషన్ గురించి మాట్లాడుతూ, రాసుకున్న స్క్రిప్ట్ లేదా డైలాగుల్లో ఎటువంటి మార్పులు చేయనని, అయితే నటీనటుల సౌలభ్యం కోసం లేదా టైమింగ్ కోసం చిన్నపాటి సవరణలు చేయవచ్చని రవి బాబు వెల్లడించారు.
8 ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సినిమా.. రూ.25 కోట్లు పెడితే రూ.180 కోట్లు వచ్చాయి.. ఇప్పటికీ ఓటీటీలో ట్రెండింగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.