చాలా మంది ఒంట్లో వేడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు ఈ వడలను తింటే చాలు. మీరు మీ ఇంట్లో కూడా ఇలాగే ట్రై చేసి తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..
సగ్గుబియ్యం వడలకు కావాల్సిన పదార్ధాలు : మూడు కప్పులు మినపప్పు, రెండు చిన్న ఉల్లిపాయలు , 4 పచ్చిమిర్చి, ఒక కప్పు సగ్గు బియ్యం, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ , ఐదు కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర, ఒక టీ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, రుచికి తగినంత ఉప్పు, సగ్గుబియ్యం వడలు కాల్చుకోవడానికి సరిపడా నూనెను తీసుకోవాలి.
సగ్గుబియ్యం వడలు తయారి విధానం : ముందుగా మీరు సగ్గుబియ్యం తీసుకుని వాటిని మంచిగా కడిగి 15 నిమిషాలు పాటు వీటిని మంచిగా నానబెట్టాలి. కొద్దీ సేపటి తర్వాత దీనిలో ఉన్న నీరు మొత్తాన్ని వంపేసి సగ్గుబియ్యం మాత్రమే ఒక గిన్నెలో పెట్టుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని ఎక్కువగా పల్లె టూర్లలో చేసుకుని తింటారు.
సగ్గుబియ్యం వడలు తయారి విధానం స్టెప్ 1: సగ్గుబియ్యం వడల పిండిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 5 కరివేపాకు ఆకులు, ఒక కప్పు కొత్తిమీర, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి దీనిలో మిక్స్ అయ్యేలా కలపాలి. మీరు దీనిలో బియ్యపు పిండి కూడా వేసి కలపాలి. పిండి పలుచగా ఉన్నట్లు మీకు అనిపిస్తే అప్పుడే ఇది కలిపితే సరిపోతుంది.
సగ్గుబియ్యం వడలు తయారి విధానం స్టెప్ 2: మీ చేతికి ఒక టేబుల్ నూనె రాసుకుని చిన్న చిన్న ముద్దలాగా తీసుకుని వీటిని వడలుగా ఒత్తుకోవాలి. ఇంకో వైపు పొయ్యి మీద పెట్టిన పాన్ పెట్టి నూనె వేసి వీటిని మీడియం మంటపై వడలను ఎర్రగా కాల్చుకోవాలి. అంటే ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు గోధుమ రంగులోకి మారిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. అంతే వేడి వేడి సగ్గుబియ్యం వడలు రెడీ.




