నగరంలో ట్రాఫిక్ నిబంధనలను పెడచెవిన పెడుతూ, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు వేగవంతం చేశారు. నిబంధనలు పాటించని వారిని అరికట్టేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏకంగా 327 మంది పట్టుబడగా, వారిపై కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ADCP (అడ్మిన్) జి. నరేందర్ వెల్లడించారు. పట్టుబడిన వాహనాల్లో 255 ద్విచక్ర వాహనదారులు,13 ఆటోలు, 55 కార్లు, 04 హెవీ వాహనాలు ఉన్నాయన్నారు.
రక్తంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా కేసుల వివరాలు
పట్టుబడిన వారిలో ఆల్కహాల్ మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎం జీ/100 ఎంఎల్ మధ్య, -35 మంది 201 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 300 ఎం జీ/100 ఎంఎల్ మధ్య, -22 మంది 301 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 550 ఎం జీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారని ఆయన తెలిపారు. వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు స్పష్టం చేశారు.
పోలీసుల తీవ్ర హెచ్చరిక!
మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరం. తాగి వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తాం. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉంది” అని సైబరాబాద్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,