Headlines

Vegetable Prices: హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు.. ఇదిగో లేటెస్ట్ రేట్లు ఇవే! | Check Latest Vegetable Prices in Hyderabad Kukatpally Rythu Bazar on 4th August

Vegetable Prices: హమ్మయ్య ఎట్టకేలకు దిగొచ్చాయి! తగ్గిన కూరగాయల ధరలు.. ఇదిగో లేటెస్ట్ రేట్లు ఇవే! | Check Latest Vegetable Prices in Hyderabad Kukatpally Rythu Bazar on 4th August


హైదరాబాద్‌లోని ప్రజలకు ఇదో ఊరటనిచ్చే వార్తనే చెప్పాలి. ఎందుకుంటే గత కొన్ని రోజుగా ముట్టుకుంటే అంటుకుంటాయోమో అనే స్థాయిలో ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు దిగొచ్చాయి. గత రెండు మూడు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాపు కూడా పెరిగిన రైతు మార్కెట్‌లకు వచ్చే కూరగాయల సరఫరా కూడా పెరిగింది. దీంతో అవసరారిని సరిపడా కూరగాయలు అందుబాటులో ఉండడంతో ధరలు కూడా దిగొచ్చాయి. దీంతో హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలోని మోడరన్ అండ్ మోడల్ రైతుబజార్‌తో సహా నగర వ్యాప్తంగా ఉన్న చాలా రైతు బజార్లో కూర గాయల ధరలు ప్రజలకు ఆశించిన మేరే కనిపిస్తున్నాయి.

ఈరోజు అంటే (04.08.2026) మంగళవారం విక్రయించే రోజువారీ కూరగాయల అధికారిక ధరల జాబితాను ఎస్టేట్ ఆఫీసర్ విడుదల చేశారు. వినియోగదారులకు తాజా కూరగాయలు అందుబాటు ధరల్లో లభించేలా ఈ ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. ధరలను ఈ క్రింది విధంగా నిర్ణయించారు.

కూకట్‌పల్లి రైతు బజార్‌లో మంగళవారం ధరలు ఇవే

ప్రధాన కూరగాయలైన టమాటా కేజీ రూ. 17 ఆలుగడ్డ కేజీ రూ.19, ఉల్లిగడ్డ కేజీ రూ. 34 కి విక్రయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇక బెండకాయ:రూ.40, వంకాయ:రూ.35 , పచ్చి మిర్చి:రూ.45 , కాకరకాయ:రూ.40, బీరకాయ:రూ.38 , క్యాబేజీ:రూ.18 , క్యారెట్:రూ.41 , గోబిపువ్వు :రూ.25, దోసకాయ:రూ.18, సొరకాయ:రూ.15, పొట్లకాయ:రూ.23 గా విక్రయిస్తున్నారు.

అలాగే దొండకాయ:రూ.45 , బీన్స్:రూ.80 , చిక్కుడుకాయ:రూ.50 , గోరుచిక్కుడు:రూ.35 , బీట్ రూట్:రూ.35 , క్యాప్సికం:రూ.40 కీరా (లోకల్):రూ.23, కీరా రూ.45 విక్రయిస్తున్నారు. ఉల్లిపొరక:రూ.55 , కంద:రూ.40 | చామగడ్డ:రూ.35 | చిలగడ దుంప:రూ.35 , గుమ్మడికాయ:రూ.40 లకు అమ్ముతున్నారు.

ఇక ఇతర దినుసులు, పండ్లు, మసాలా దినుసులు ధరలు చూసుకుంటే.. పాత అల్లం కేజీ రూ.220, వెల్లుల్లి కేజీ:రూ.260 ఎండు మిర్చి:రూ.260, పండు మిర్చి:రూ.80 , చింతపండు:రూ.160 , ఆ కాకరకాయ:రూ.135, ఉసిరి:రూ.100, పల్లికాయ :రూ.70, పర్వల్:రూ.65 , లోబా:రూ.23, కరివేపాకు:రూ.50, బొప్పాయి:రూ.40, పుట్టగొడుగులు రూ. 45లకు విక్రయిస్తున్నారు.

గమనిక: అయితే అన్ని ప్రాంతాల్లో ఈ ధరలు ఒకేలా ఉండకపోవచ్చు. ఎందుకంటే రైతు బజార్‌లలో నేరుగా రైతుల నుంచి కూరగాయలు విక్రయించబడటం వల్ల మార్కెట్‌తో పోలిస్తే కొంత తక్కువ ధరలకు కూరగాయలు దొరుకుతాయి. అయితే సరఫరా, డిమాండ్‌ను బట్టి ఎప్పికప్పుడూ ధరల్లో మార్పులు ఉంటాయి. కాబట్టి కొనే ముందు తాజా ధరలను ఒకసారి చెక్ చేసుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *