విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రోక్షణ, రుత్విగ్వరణం, అమ్మవారికి ప్రత్యేక ఆవాహన, దీక్షా ధారణలతో యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణ, వేదపారాయణ, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, రుద్ర జపాలు, వరుణ మంత్ర హోమాలు, ఆలయ బలిహరణ కార్యక్రమాలను అర్చకులు అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.