Headlines

Bullet Train: గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు.. ఎప్పుడంటే..! | Railways mumbai ahmedabad bullet train launch date 320 kmph undersea tunnel


Bullet Train: ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య నడవనున్న భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (MAHSR) కారిడార్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. మొదటి బుల్లెట్ రైలు ఒక సంవత్సరంలో అంటే 2027 ఆగస్టు 15 నాటికి నడవడం ప్రారంభించవచ్చు. మొదటి దశలో గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్స్ నిర్వహిస్తారు. మొత్తం ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌ను 2029 నాటికి కార్యరూపంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బుల్లెట్ రైలు ప్రాజెక్టులో అత్యంత ఉత్తేజకరమైన, సవాలుతో కూడిన భాగం ముంబై సమీపంలో నిర్మిస్తున్న సముద్రగర్భ రైలు సొరంగం. సుమారు 7 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగాన్ని సముద్ర మట్టానికి 32 మీటర్ల దిగువన నిర్మిస్తున్నారు. నీరు లీక్ అవ్వకుండా నిరోధించడానికి ఒక ప్రత్యేక జలనిరోధక పొరను అమర్చారు. అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) మరియు NATM సాంకేతికతను ఉపయోగించి తవ్వకం పనులు జరుగుతున్నాయి. ప్రతి నెలా 300 నుండి 400 మీటర్ల మేర తవ్వకం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

ఇవి కూడా చదవండి



జపనీస్ షింకన్సెన్ సాంకేతికత ఆధారంగా, ఈ బుల్లెట్ రైలు రూపకల్పన వేగం గంటకు 350 కి.మీ. ఉండగా, 320 కి.మీ. వేగంతో దూసుకెళ్లాల సెట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. 508 కి.మీ.ల ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లను నిర్మిస్తున్నారు. మహారాష్ట్రలో, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC), థానే, విరార్, బోయిసార్‌లలో బుల్లెట్ రైలు స్టేషన్లు ఉంటాయి. గుజరాత్‌లో వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతిలలో స్టేషన్లు ఉంటాయి.

బీకేసీ స్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫారాలు, 30 అంతస్తుల భవనం:

ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) స్టేషన్ ఈ నెట్‌వర్క్‌కు ప్రధాన టెర్మినల్‌గా ఉంటుంది. దీనిని రూ.3,680 కోట్ల (సుమారు $3.6 బిలియన్లు) వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఆరు ప్లాట్‌ఫారమ్‌లను నిర్మిస్తున్నారు. ఇవి సమీపంలోని మెట్రో లైన్‌కు నేరుగా అనుసంధానిస్తారు. భవిష్యత్తులో 30 అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు వీలుగా ఈ స్టేషన్‌ను పటిష్టంగా రూపొందించారు. ప్రస్తుతం, 98% తవ్వకం పనులు పూర్తయ్యాయి.

ఇది కూడా చదవండి: Traffic Lights: ట్రాఫిక్ లైట్లలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే!

రూ.1.08 లక్షల కోట్ల బడ్జెట్‌

ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.1,08,000 కోట్లు. జపాన్ రూ.88,000 కోట్ల రాయితీ రుణాన్ని అందిస్తోంది. భారత ప్రభుత్వం రూ.10,000 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు చెరో రూ.5,000 కోట్లు అందిస్తున్నాయి.

భారతదేశంలో తొలిసారిగా ట్రాక్ నిర్మాణంలో జపనీస్ జె-స్లాబ్ బ్యాలస్ట్‌లెస్ ట్రాక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇది బ్యాలస్ట్ లేని కాంక్రీట్ స్లాబ్‌లపై ఆధారపడి ఉంటుంది. అలాగే అధిక వేగంతో రైలు స్థిరత్వాన్ని అందిస్తుంది. సబర్మతి, సూరత్, థానేలలో మూడు ఆధునిక రోలింగ్ స్టాక్ డిపోలను నిర్మిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం రూ.3 లక్షలు.. వెండి రూ.6 లక్షలు దాటుతుందా..? మరో సంచలన ప్రకటన..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *