Headlines

Indian Cricket History: 600వ టెస్టులో ఘన విజయం.. మరి 1, 100, 200, 300.. మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచిందా ? | India test cricket journey 1st to 600th match results record


Indian Cricket History: టీమిండియా తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ను స్వాతంత్య్రానికి పూర్వమే 1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో ఆడింది. నాటి బలమైన ఇంగ్లాండ్ జట్టు చేతిలో భారత్ 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సరిగ్గా 35 ఏళ్ల తర్వాత 1967లో బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌పైనే తమ 100వ టెస్టును ఆడిన భారత జట్టు తీవ్ర పోరాటం చేసినప్పటికీ 132 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రారంభ దశాబ్దాల్లో విదేశీ గడ్డపై మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు సవాలుగా ఉండేదనడానికి ఈ ఫలితాలే నిదర్శనం.

200, 300వ టెస్టులు..

1982లో లాహోర్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తన 200వ టెస్టును ఆడింది. మొహిందర్ అమర్‌నాథ్ అద్భుత సెంచరీతో రాణించడంతో ఈ మ్యాచ్ సమర్థవంతంగా డ్రాగా ముగిసింది. ఆ తర్వాత 1996లో అహ్మదాబాద్ వేదికగా పటిష్టమైన సౌతాఫ్రికాపై భారత్ తన 300వ టెస్టు ఆడింది. అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్ పదునైన బౌలింగ్ ధాటికి పర్యాటక ప్రోటీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 105 పరుగులకే కుప్పకూలడంతో భారత్ 64 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది.

ఇది కూడా చదవండి: Saaniya Chandhok: సచిన్ కోడలు సానియా చందోక్‌లో ఈ టాలెంట్ ఉందా? ఏం చేసిందో తెలిస్తే వావ్ అంటారు

400, 500వ టెస్టులు..

2006లో కింగ్‌స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన 400వ టెస్టులో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత్ 49 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. కఠినమైన పిచ్‌పై ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయాన్ని ముద్దాడింది. అనంతరం 2016లో కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన 500వ మైలురాయి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ మ్యాజిక్ బౌలింగ్‌తో టీమిండియా 197 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రెడ్ బాల్ ఫార్మాట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించింది.

ఇది కూడా చదవండి: SL vs IND 2nd Test: ఆ రూల్ ఎఫెక్ట్.. 2వ టెస్ట్ కు ముందే ఊహించని షాక్.. ఏకంగా ముగ్గురు ఔట్..!

600వ టెస్టులో లంకపై చారిత్రాత్మక విజయం

ఆగస్టు 2026లో శ్రీలంకలోని గాలే మైదానంలో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడిన 600వ టెస్టు మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. దేవదత్ పడిక్కల్ అద్భుత శతకం (167), స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్ల మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో లంకను 165 పరుగుల తేడాతో మట్టికరిపించి భారత్ విజయభేరి మోగించింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తర్వాత ప్రపంచంలోనే 600 టెస్టులు పూర్తి చేసుకున్న మూడో దేశంగా, ఆసియాలోనే మొదటి జట్టుగా భారత్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 1932లో తొలి అడుగు వేసిన భారత్, 600వ టెస్టు నాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ శక్తులలో ఒకటిగా ఎదిగింది. ప్రతి వందవ టెస్టులో సాధించిన ప్రగతి భారత జట్టు సాధించిన అభివృద్ధికి, ఆటగాళ్ల పట్టుదలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *