అభివృద్ధి, ప్రజాస్వామ్యం, సమ్మిళిత ప్రగతిపై దేశ ప్రజలకు రాష్ట్రపతి కీలక సందేశం..! | President of India Droupadi Murmu 80th Independence Day Eve Address Operation Sindoor Indus Treaty Suspension
న్యూఢిల్లీ, ఆగస్టు 14: 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి ప్రస్థానం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్ భారతదేశ లక్ష్యాలపై ఆమె ప్రసంగంలో ప్రస్తావించారు. దేశ, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. మరికొన్ని గంటల్లో దేశం 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోందని అన్నారు….