పరిమాణం కాదు.. రంగు ముఖ్యం: చాలామంది పెద్ద సైజు బొండాలలోనే ఎక్కువ నీళ్లు ఉంటాయని భావిస్తారు, కానీ అది నిజం కాదు. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా ఉండే మీడియం సైజు బొండాల్లోనే తియ్యటి నీరు పుష్కలంగా లభిస్తుంది. అలాగే రంగు విషయంలోనూ జాగ్రత్త వహించాలి. పైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఎక్కువగా ఉంటే ఆ బొండం ముదిరిపోయిందని, లోపల గట్టి కొబ్బరి ఏర్పడి నీళ్లు తగ్గిపోయాయని అర్థం. లేత ఆకుపచ్చ రంగులో, తాజాగా మెరుస్తూ ఉండే బొండాలు లేతగా ఉండి ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి.