గ్లాస్గో క్రీడల్లో నాలుగో రోజు భారత అభిమానులకు మైమరపించే వార్త లభించింది. మహిళల 48 కేజీల ఫైనల్ పోటీలు ప్రారంభం కావడంతో అందరి చూపులు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుపైనే నిలిచాయి. స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీల బరువు ఎత్తడంలో ఆరంభంలో చిన్న తడబాటు ఎదురైంది. అయితే ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రెండో ప్రయత్నంలో 82 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి పోటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల బరువును ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త స్నాచ్ రికార్డును నమోదు చేసింది.