Headlines

ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. ప్రత్యర్థే కాదు, మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే.. ఏకిపారేసిన జైస్వాల్..! | Yashasvi jaiswal kl rahul run out controversy sri lanka test


Yashasvi Jaiswal vs KL Rahul Run Out Controversy: గాలే వేదికగా సాగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ముగిసింది. భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 450 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 167, జురేల్ 51 పరుగులు చేశారు. అయితే, నెట్టింట ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. తన రనౌట్ విషయంలో సహచర ఆటగాడు కేఎల్ రాహుల్, శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డి సిల్వాపై యశస్వి జైస్వాల్ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు వస్తున్న వదంతులు క్రికెట్ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

క్రీజులో భారత బ్యాటర్ల ఆధిపత్యం..

శ్రీలంక గడ్డపై భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. చారిత్రాత్మక గాలే అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. రెండో రోజు ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 460 పరుగుల భారీ స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచి లంక బౌలర్లకు చుక్కలు చూపించిన యువ సంచలనం దేవదత్ పడిక్కల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అద్భుతమైన ఫుట్‌వర్క్, కచ్చితమైన టైమింగ్‌తో ఏకంగా 167 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ లంక బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.

ఇవి కూడా చదవండి



ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..!

మైదానంలో హైడ్రామా.. అసలేం జరిగిందంటే..?

అదే సమయంలో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఒకే ఒక్క రనౌట్ వివాదంపైనే నిలిచింది. ఇన్నింగ్స్ ఆరంభంలో క్రీజులో ఉన్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నేరుగా ఒక స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతిని ఆపే తొందరలో శ్రీలంక బౌలర్ కేశవ వేగంగా ఫాలో త్రూలో ముందుకు రాగా, అప్పటికే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో పరుగు ప్రారంభించిన జైస్వాల్ కాళ్లను బలంగా ఢీకొట్టాడు. ఆ తీవ్రమైన తాకిడికి బ్యాలెన్స్ తప్పిన జైస్వాల్ అమాంతం పిచ్‌పై కుప్పకూలాడు. ఆ గందరగోళ సమయంలో అతడు సమయానికి క్రీజులోకి చేరుకోలేకపోవడంతో దురదృష్టవశాత్తూ వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటన స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను సైతం తీవ్ర విస్మయానికి గురిచేసింది.

నెట్టింట వైరల్ అవుతున్న సంచలన పోస్ట్..

మైదానంలో జరిగిన ఆ దురదృష్టకర రనౌట్ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త మలుపు తిరిగింది. దీనికి సంబంధించి జైస్వాల్ పేరుతో ఒక వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మంచి ఫామ్‌లో ఉండి భారీ స్కోరు సాధించాలనే కసితో ఉన్న తనను రాహుల్ దారుణంగా మోసం చేశాడనేది ఆ పోస్ట్ సారాంశం. కింద పడిపోయి విలవిలలాడుతున్న తనను చూసి కూడా రాహుల్ వెనక్కి తగ్గకుండా స్వార్థంతో పరుగు కోసం రావడం వల్లే తాను రనౌట్‌గా బలి కావాల్సి వచ్చిందని జైస్వాల్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ వైరల్ పోస్ట్‌లో ఉంది. రాహుల్ చేసిన తప్పిదానికి తాను వికెట్ కోల్పోవడం ఏమాత్రం సహేతుకం కాదని, కేవలం 32 పరుగులకే ఔటవ్వడం తనను మానసికంగా తీవ్రంగా కలచివేసిందని అతడు పేర్కొన్నట్లు సమాచారం.

ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

కనికరించని లంక కెప్టెన్.. క్రీడాస్ఫూర్తి కరువు..

సొంత జట్టు ఆటగాడి తీరుతో పాటు శ్రీలంక ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తి పైనా ఆ పోస్ట్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బౌలర్ ఢీకొట్టడం వల్లే తాను కిందపడ్డాననే కనీస కనికరం లేకుండా శ్రీలంక ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. లంక కెప్టెన్ ధనుంజయ డి సిల్వా సైతం క్రూరంగా వ్యవహరించాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం అప్పీల్ వెనక్కి తీసుకునే అవకాశం కెప్టెన్‌కు ఉన్నప్పటికీ, వాళ్లు అలా చేయకపోవడం వల్లే జైస్వాల్ ఇన్నింగ్స్‌కు అన్యాయంగా తెరపడింది. ఈ సంచలన వ్యాఖ్యలు నిజంగా జైస్వాల్ చేశాడా, లేక ఇదంతా కేవలం ఒక పుకారు మాత్రమేనా అన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ అభిమానులు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వాగ్వాదాలకు దిగుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *