పెద్దపల్లి: తెలంగాణ జానపద కళకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన జానపద కడ్డీ తంత్రి కళాకారుడు దుర్శేటి రామయ్య కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. జానపద సంగీత విభాగంలో తెలంగాణ నుంచి ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రామయ్య అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు. తెలంగాణ జానపద సంగీతాన్ని, కడ్డీ తంత్రి కళను రామయ్య ఎన్నో ఏళ్లుగా కాపాడుతూ, భావితరాలకు పరిచయం చేస్తూ వస్తున్నారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకోవడం గర్రెపల్లి గ్రామానికి ప్రత్యేక గౌరవంగా నిలిచింది. తమ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన రామయ్యను గ్రామస్తులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జానపద కళలకు మరింత ప్రాచుర్యం తీసుకురావడంలో ఈ పురస్కారం స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..