Headlines

పిల్లల్ని చూసి ఒక్కసారిగా ఆగిన మంత్రి కారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? | AP Minister Dola Sree Bala Veeranjaneya Swamy Interacts with School Children, Checks Thalli Ki Vandanam Scheme Benefits

పిల్లల్ని చూసి ఒక్కసారిగా ఆగిన మంత్రి కారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? | AP Minister Dola Sree Bala Veeranjaneya Swamy Interacts with School Children, Checks Thalli Ki Vandanam Scheme Benefits


ప్రకాశం జిల్లాలో మంత్రి బాలవీరాంజనేయస్వామికి అరుదైన అనుభవం ఎదురైంది. కొండపి నుంచి మర్రిపూడి వైపు వెళుతుండగా మార్గ మధ్యంలో కొంతమంది చిన్నారులు టపాసులు పేలుస్తూ కనిపించడంతో మంత్రి కారును ఆపారు. చిన్నారులను పిలిచి అబ్బాయిలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అందులో 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్ధులు ఉన్నారు. మంత్రి స్వామిని గుర్తు పట్టిన ఆ చిన్నారులు సంతోషంతో ఆయనతో మాటలు కలిపారు. అబ్బాయిలు ఇక్కడేం చేస్తున్నార్రా..? అంటూ మంత్రి స్వామి ఆప్యాయంగా ప్రశ్నించారు.. దీంతో సమాధానం ఇచ్చిన చిన్నారులు.. మీరు వస్తున్నారని టపాసులు పేలుస్తున్నామని బాలురు చమత్కరించారు. దీంతో అరే, అంటూ మంత్రి ఆశ్చర్యపోతూనే వాళ్ళు చేతుల్లో ఉన్న అగ్గిపెట్టెలతో జాగ్రత్త చేతులు కాలుతాయని మంత్రి జాగ్రత్తలు చెప్పారు.

ఈ సందర్బంగా తల్లికి వందనం డబ్బులు వచ్చాయా..? అని చిన్నారులను ప్రశ్నించారు.. తమ తల్లుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని చిన్నారులు సమాధానం ఇచ్చారు. ఓ విద్యార్ధి మాట్లాడుతూ.. తమ ఇంట్లో 39 వేలు పడ్డాయని ఆనందంగా చెప్పాడు. చివరిలో ఓ విద్యార్ధి తనకు తల్లికి వందనం డబ్బులు రాలేదని చెప్పడంతో వెంటనే స్పందించిన మంత్రి స్వామి తన సిబ్బందిని పిలిచి ఆ విద్యార్ధి డబ్బులు రాలేదంటున్నాడు.. ఏంటో విచారించి తనకు చెప్పాలని ఆదేశించారు. రోడ్డుపై చిన్నారులతో మంత్రి ఆసక్తిగా ముచ్చటించిన సంభాషణలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *