Headlines

ప్రపంచపు మొదటి క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఇప్పటికీ ఉందా? ఎంత ఖర్చుతో కట్టారు? | World’s First Cricket Stadium: The Untold History of Lord’s, Its Construction and 5 Historic Matches

ప్రపంచపు మొదటి క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఇప్పటికీ ఉందా? ఎంత ఖర్చుతో కట్టారు? | World’s First Cricket Stadium: The Untold History of Lord’s, Its Construction and 5 Historic Matches


క్రికెట్ అనగానే చాలా మంది మ్యాచ్‌లు, రికార్డులు, బ్యాటర్లు, బౌలర్ల గురించే చెప్పుకుంటారు. కానీ, అసలు ఆ మ్యాచ్‌లు జరిగే గ్రౌండ్‌ల గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటారు. నిజానికి క్రికెట్ ఇప్పుడు ఈ స్థాయిలో అభివ‌ృద్ధి చెందడంలో మొట్టమొదటి క్రికెట్ స్టేడియం పాత్ర ఎంతో ఉంది. ఇంతకీ ఆ స్టేడియం ఏది? దాని ఎప్పుడు, ఎవరు, ఎక్కడ కట్టారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

క్రికెట్‌కు జన్మనిచ్చిన దేశం ఇంగ్లాండ్. అందుకే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు అక్కడే ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే తొలి ప్రత్యేక క్రికెట్ మైదానంగా గుర్తింపు పొందిన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఇప్పటికీ క్రికెట్‌ మక్కాగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రౌండ్ కేవలం స్టేడియం మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రను మలిచిన ఎన్నో అద్భుత ఘట్టాలకు సాక్షిగా నిలిచింది.

లార్డ్స్ స్టేడియం ఎప్పుడు నిర్మించారు?

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ను వ్యాపారవేత్త థామస్ లార్డ్ 1814లో ఇంగ్లాండ్‌లోని లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో నిర్మించారు. దీనికి ముందు 1787, 1791లో ఆయన ఏర్పాటు చేసిన రెండు మైదానాలు వేరే ప్రాంతాల్లో ఉండేవి. ప్రస్తుతం ఉన్న లార్డ్స్ మైదానం 1814లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇదే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికగా కొనసాగుతోంది.

వీడియో చూడండి

నిర్మాణానికి ఎంత ఖర్చయింది?

1814లో ఈ మైదానం నిర్మాణానికి సుమారు 18,000 ఆ కాలపు బ్రిటిష్ పౌండ్లు వరకు వ్యయం అయినట్లు చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. ప్రస్తుత విలువ ప్రకారం అది కోట్ల రూపాయలకు సమానమవుతుంది. అనంతర కాలంలో పావిలియన్, మీడియా సెంటర్, గ్రాండ్‌స్టాండ్లు, ఆధునిక సదుపాయాలు నిర్మించడంతో ఈ స్టేడియం మరింత అభివృద్ధి చెందింది.

1814లో ప్రారంభమైన అదే లార్డ్స్ మైదానం ఇప్పటికీ కొనసాగుతోంది. కాలానుగుణంగా అనేక మార్పులు, ఆధునికీకరణలు జరిగినప్పటికీ దాని చారిత్రక గుర్తింపు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఇది మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (MCC) ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ప్రపంచంలోని ప్రతి క్రికెటర్ జీవితంలో ఒక్కసారైనా లార్డ్స్‌లో ఆడాలని కలలు కంటాడు.

లార్డ్స్‌లో జరిగిన ఐదు చారిత్రక మ్యాచ్‌లు

  • 1884లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య లార్డ్స్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌తో లార్డ్స్ టెస్టు క్రికెట్‌కు అధికారిక వేదికగా నిలిచింది.
  • 1983 వరల్డ్ కప్ ఫైనల్.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం 1983 జూన్ 25న లార్డ్స్‌లోనే నమోదైంది. కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత్ బలమైన వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ విజయం భారత క్రికెట్‌ను పూర్తిగా మార్చేసిన మలుపుగా గుర్తించబడుతుంది.
  • 2002 నాట్‌వెస్ట్ ఫైనల్.. ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుత భాగస్వామ్యంతో భారత్ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో టీ-షర్ట్ ఊపిన దృశ్యం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
  • 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్.. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన 2019 ప్రపంచకప్ ఫైనల్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌గా నిలిచింది. మ్యాచ్, సూపర్ ఓవర్ రెండూ టై కావడంతో బౌండరీ కౌంట్ నిబంధన ఆధారంగా ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
  • 2021 భారత్-ఇంగ్లాండ్ టెస్టు.. 2021లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా చివరి వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేయగా, అనంతరం భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేశారు. లార్డ్స్‌లో భారత్ సాధించిన అత్యంత గుర్తుండిపోయే టెస్టు విజయాల్లో ఇది ఒకటి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *