చిరుధాన్యాల ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేయడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల రోజులుగా హార్టికల్చర్ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఎంతో ఆసక్తి, అంకితభావంతో పనిచేసి పచ్చదనంతో కళకళలాడే ‘మిల్లెట్ భారత్’ను రూపొందించారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, వరిగలు తదితర చిరుధాన్యాల ప్రాధాన్యతను ఈ చిత్రపటం ద్వారా చాటి చెప్పారు.