సముద్ర మట్టానికి ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాలలోని అల్పపీడన ప్రాంత కేంద్రం, గుణ, సిద్ధి, డాల్టన్గంజ్ మీదుగా వెళ్లి అక్కడి నుండి ఆగ్నేయంగా ఈశాన్య బంగాళాఖాతం వైపుకు విస్తరిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడ్రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వానలు కురవనున్నాయని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు వానలు పడతనున్నాయి. అటు రాగల 3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 -4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.