పొలాల్లో దిగి పనిచేసే శారీరక సత్తువ తమకు ఇప్పుడు లేదని, వృద్ధాప్యంలో మందుల ఖర్చులు, నిత్య జీవనానికి ఆసరాగా ఉంటాయనే ఉద్దేశంతోనే పైసా పైసా కూడబెట్టి సొసైటీలో డిపాజిట్ చేశామని నర్సింహమూర్తి, ఆయన భార్య లక్ష్మీదేవి కన్నీటిపర్యంతమయ్యారు. తీరా అవసరమైన సమయంలో అసలు సొమ్ము ఇవ్వకపోగా, కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ వృద్ధ దంపతులు వాపోయారు.