
బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం స్వల్పంగా పెరగ్గా.. ఆదివారం నాటికి స్వల్పంగా తగ్గాయి. అమెరికాలో యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్కు గిరాకీ తగ్గింది. యూఎస్లో ఉద్యోగ కల్పన అంచాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో పసిడికి డిమాండ్ పెరుగుతోండగా.. అదే విధంగా ఫెడ్ వడ్డీ రేట్లను సవరించే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరల్లో ఊహించని మార్పులు గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్నాయి. ఇంటర్నేషల్ బులియన్ మార్కెట్లు పసిడి ధరలు ఒడిదొడుకులకు లోనవుతుండగా.. దేశీయంగా కూడా అదే బాటలో కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీన దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయంటే..?
-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,800 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,900గా కొనసాగుతోంది.
-హైదరాబాద్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,54,800 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,900గా ఉంది.
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,670 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,610గా ఉన్నాయి.
-బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,800 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,900 వద్ద ట్రేడవుతోంది.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,950గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,050 వద్ద కొనసాగుతోంది
వెండి ధరలు చూస్తే..
-దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది
-హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.
చె-న్నైలో కేజీ వెండి ధర రూ.2,54,900గా ఉంది
బెంగళూరులో కిలో వెండి ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది