Headlines

IND vs AUS: 12 ఏళ్లుగా దక్కని విజయం.. సీక్రెట్ ప్లాన్‌తో ఆసీస్ బరిలోకి.. బీజీటీకి 5 నెలల ముందునుంచే.. | Australia coach andrew mcdonald master plan border gavaskar trophy india

IND vs AUS: 12 ఏళ్లుగా దక్కని విజయం.. సీక్రెట్ ప్లాన్‌తో ఆసీస్ బరిలోకి.. బీజీటీకి 5 నెలల ముందునుంచే.. | Australia coach andrew mcdonald master plan border gavaskar trophy india


India vs Australia Test Series: వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా ఇప్పటినుంచే పక్కా వ్యూహాలు రచిస్తోంది. టీమిండియాను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి కప్పు కొట్టేందుకు ఆసీస్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డోనాల్డ్ ప్రత్యేక బ్లూ ప్రింట్ సిద్ధం చేశామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచ క్రికెట్‌లో భారత్-ఆస్ట్రేలియా టెస్టు పోరుకు ఉండే క్రేజ్ వేరు. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి నాగపూర్ వేదికగా ప్రారంభం కానున్న ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (BGT) కోసం కంగారూలు తీవ్ర స్థాయిలో కసరత్తు మొదలుపెట్టారు. గతంలో 2004-05 సీజన్ నుంచి ఇప్పటివరకు భారత్ వేదికగా జరిగిన ఏ ఒక్క బిజిటి సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియా గెలవలేకపోయింది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు ఎలాగైనా తెరదించాలని ఆసీస్ కోచింగ్ స్టాఫ్ పట్టుదలతో ఉంది. ఇదికూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ ఎఫెక్ట్.. రెండుగా చీలిన బీసీసీఐ.. ప్రపంచకప్ 2027 రేసులో ఉంటాడా లేదా..?

మన పిచ్‌లకు అలవాటు పడేలా స్పెషల్ క్యాంప్..

భారత్‌లో అడుగుపెట్టడానికి ముందే ఇక్కడి స్పిన్ ట్రాక్‌లు, పొడి వాతావరణాన్ని తట్టుకునేందుకు ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని (ట్రైనింగ్ క్యాంప్) ఏర్పాటు చేసుకుంటోంది. గతం లో దుబాయ్, బెంగళూరు వేదికలుగా ప్రత్యేక ప్రాక్టీస్ క్యాంప్‌లు పెట్టిన ఆసీస్, ఈసారి కూడా మ్యాచ్‌లకు ముందే ప్రత్యేక వేదికను ఎంచుకోనుంది.

ఇవి కూడా చదవండి



రోహిత్ సేనను ఎదుర్కొనేందుకు భారత్‌లో ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదని, నేరుగా ప్రత్యేక క్యాంప్ ద్వారానే భారత స్పిన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని ఆండ్రూ మెక్‌డోనాల్డ్ స్పష్టం చేశారు. టీమిండియాలోని ప్రతి ఒక్క ఆటగాడి బలహీనతలను విశ్లేషిస్తూ వారిని దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదికూడా చదవండి: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

ఆటగాళ్ల ఎంపికపై కంగారూల వ్యూహం..

ఈ ఏడాది డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా ఆడబోయే నాలుగు టెస్టుల సిరీస్ ఆధారంగా భారత పర్యటనకు వచ్చే జట్టును ఎంపిక చేయనున్నారు. కివీస్‌పై మెరుగ్గా రాణించి, భారత స్పిన్ పిచ్‌లపై పోరాడగల స్పెషలిస్ట్ ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తామని మెక్‌డోనాల్డ్ వెల్లడించారు.

భారత వాతావరణం, పిచ్ స్వభావంపై అవగాహన ఉన్న ఆటగాళ్లను మాత్రమే భారత్‌కు పంపేందుకు ఆసీస్ సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారు. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా, మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెడ్ కోచ్ పేర్కొన్నారు. ఇదికూడా చదవండి: రోహిత్‌నే తప్పిద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. అగార్కర్ పోస్ట్‌కే చెక్ పెట్టేసిన హిట్‌మ్యాన్.. నెక్ట్స్ బాస్‌గా తెలుగోడే..?

భారత్‌కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆశలు..

మరోవైపు టీమిండియాకు కూడా ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే ఆస్ట్రేలియాపై విజయం సాధించడం భారత్‌కు తప్పనిసరి. ఆసీస్ ఎంత పక్కా ప్లాన్‌తో వచ్చినా, మన సొంత గడ్డపై స్పిన్ మ్యాజిక్‌తో వారిని తిప్పికొట్టేందుకు భారత్ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *