Headlines

IND vs ZIM 2nd T20I: కాటేరమ్మ కొడుకుపై వేటు.. రెండో టీ20లో ఊహించని మార్పుతో బరిలోకి భారత జట్టు..? | Indias predicted playing xi for 2nd t20i vs zimbabwe 2026 abhishek sharma out

IND vs ZIM 2nd T20I: కాటేరమ్మ కొడుకుపై వేటు.. రెండో టీ20లో ఊహించని మార్పుతో బరిలోకి భారత జట్టు..? | Indias predicted playing xi for 2nd t20i vs zimbabwe 2026 abhishek sharma out


India Predicted Playing XI: జింబాబ్వేపై తొలి టీ20లో ఘన విజయం సాధించినప్పటికీ భారత మేనేజ్‌మెంట్‌కు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఫామ్ లేమితో తడబడుతున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. సిరీస్‌లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు రెండో సమరంలో తుది జట్టులో కీలక మార్పులు చేసేందుకు హెడ్ కోచ్, కెప్టెన్ వ్యూహాలు రచిస్తున్నారు.

విజయానందం ఉన్నా.. బెంచ్ బలగంపై దృష్టి..!

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మొదటి పోరులో భారత్ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. బౌలర్ల సమష్టి ప్రదర్శన, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వడమే కాబట్టి, బెంచ్‌కే పరిమితమైన మిగతా ఆటగాళ్లను రెండో మ్యాచ్‌లో పరీక్షించేందుకు మేనేజ్‌మెంట్ సన్నాహాలు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

ఇవి కూడా చదవండి



ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు తప్పదా..?

గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. తొలి టీ20లోనూ తక్కువ పరుగులకే అవుటై తీవ్ర నిరాశ పరిచాడు. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి కొనసాగుతున్న ఈ వైఫల్యాల వల్ల అతనికి కాస్త విశ్రాంతినిచ్చి, రిజర్వ్ బెంచ్ పై ఉన్న మరో యంగ్ గన్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అభిషేక్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి జోడీగా కొత్త ఓపెనర్‌ను పంపించే యోచనలో ఉన్నారు.

మిడిల్ ఆర్డర్ బలం.. బౌలింగ్ విభాగంలో సర్దుబాట్లు..!

మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. కాకపోతే, బౌలింగ్ విభాగంలో డెబ్యూ మ్యాచ్ ఆడిన అశోక్ శర్మ కొంచెం ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో, అతని స్థానంలో యశ్ ఠాకూర్ లేదా మరొక పేసర్‌ను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ శివం దూబే బౌలింగ్ ప్రదర్శనపై కూడా దృష్టి సారించిన యాజమాన్యం, పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా స్పిన్, పేస్ కాంబినేషన్‌ను కుదర్చాలని చూస్తోంది.

ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!

సిరీస్ కైవసం వైపే భారత్ చూపు..!

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా, రెండో మ్యాచ్‌లో కూడా నెగ్గి సిరీస్‌పై పట్టు బిగించాలని పట్టుదలతో ఉంది. ప్రత్యర్థి జింబాబ్వే సొంతగడ్డపై పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా పక్కా ప్రణాళికలతో మైదానంలోకి దిగాలని భారత కుర్రాళ్లు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *