JioTag 2: మీరు తరచుగా మీ తాళాలు, బ్యాగులు లేదా ఇతర ముఖ్యమైన వస్తువులను మర్చిపోతుంటే, జియో కొత్త జియోట్యాగ్ 2ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ట్రాకర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటితోనూ పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.1,249. కంపెనీ కొత్త డిజైన్తో పాటు మెరుగైన ట్రాకింగ్ ఫీచర్లను అందించింది.
ధర, కొత్త డిజైన్:
జియోట్యాగ్ 2 భారతదేశంలో రూ.1,249 ధరకు విడుదల చేసింది. బ్యాంక్ ఆఫర్లతో దీని ధరను రూ.1,199కి తగ్గించవచ్చు. ఇది నలుపు, ఎరుపు, ఆకుపచ్చ అనే మూడు రంగులలో లభిస్తుంది. కంపెనీ దీనిని కొత్త డిజైన్, ఆకారంతో పరిచయం చేసింది. వినియోగదారులు దీనిని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటితోనూ పనిచేస్తుంది:
జియోట్యాగ్ 2 అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ , iOS పరికరాలు రెండింటితోనూ పనిచేస్తుంది. మునుపటి జియోట్యాగ్ ఈ రెండు ప్లాట్ఫారమ్లకు మద్దతు ఇవ్వలేదు. ఈ కొత్త మోడల్ గూగుల్ ఫైండ్ హబ్, ఆపిల్ ఫైండ్ మై నెట్వర్క్లతో అనుసంధానం అవుతుంది. దీనివల్ల, బ్లూటూత్ పరిధికి దూరంగా ఉన్నప్పుడు కూడా వినియోగదారులు పోగొట్టుకున్న వస్తువుల లోకేష్ను గుర్తించవచ్చు. అంతేకాదు అందులో ఆ వస్తువు ఎక్కడుందో మ్యాప్ ద్వారా కూడా చూపిస్తుంది. ఆ జియోట్యాగ్ వేసి ఉన్న వస్తువును ఇంట్లో పోగొట్టుకున్నా, ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా సులభంగా గుర్తించవచ్చు.
ఇవి కూడా చదవండి
120dB స్పీకర్లు, IP64 రేటింగ్ వంటి ఫీచర్లు:
జియోట్యాగ్ 2 పాలికార్బోనేట్ పదార్థంతో తయారు చేసి ఉంటుంది. IP64 రేటింగ్ను కలిగి ఉంది. అందువల్ల ఇది దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. బ్లూటూత్ పరిధిలోని వస్తువులను గుర్తించడంలో సహాయపడటానికి, ఇందులో 120dB అంతర్నిర్మిత స్పీకర్ ఉంది. ఇది పెద్ద శబ్దాన్ని అందిస్తుంది. ఇది ఒక ప్రామాణికం కాని బ్యాటరీని ఉపయోగిస్తుంది. వినియోగదారులు తమ రోజువారీ అవసరాలను సులభంగా ట్రాక్ చేయడంలో సహాయపడటానికి ఉద్దేశించి తయారు చేశారు.
ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ ఆగస్ట్ 4 నుంచి 12వ తేదీ వరకు విద్యాసంస్థలు బంద్.. కారణం ఏంటంటే..!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి