Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగం, ఓవర్టెక్, మద్యం తాగి వాహనాలు నపడం వల్ల ఈ ప్రమాదాలో చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం అర్థరాత్రి కేరళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. త్రిసూర్ జిల్లాలో ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులందరూ విద్యార్థులేనని, వారు పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందినవారని భావిస్తున్నారు. మృతదేహాలను త్రిస్సూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. త్రిస్సూర్ సమీపంలోని కైపమంగళంలోని పనమ్బిక్కున్ను వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు హైవేపై నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. గురువాయూర్ నుంచి కొడుంగల్లూరుకు కారు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి వాహనంలో ఇరుక్కున్న వారికి బయటకు తీశారు. ప్రమాదానికి గురైన వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయినట్లుగా గుర్తించారు పోలీసులు. అందువల్ల మృతులు తమిళనాడుకు చెందిన విద్యార్థులుగా అనుమానిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి