క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో కేవలం 46 పైసల తేడాకు గాను, ఒక బ్యాంకు రూ. 1,200 పైగా జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ తన నెలవారీ బిల్లును చెల్లించే క్రమంలో పొరపాటున కేవలం 46 పైసలు తక్కువగా చెల్లించాడు. అయితే, తర్వాతి బిల్లు ప్రకటన వచ్చేసరికి ఆ 46 పైసల బకాయికి గాను బ్యాంక్ అతనికి రూ. 1,200 వరకు లేట్ ఫీజు, దానిపై వడ్డీ, జీఎస్టీలను కలిపి ఛార్జ్ చేసింది.
ఈ విషయాన్ని సదరు కస్టమర్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. కేవలం కొన్ని పైసల తేడాకే ఇంత భారీ మొత్తంలో జరిమానా విధించడం ఏమాత్రం సమంజసం కాదని వాపోయాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్గా మారడంతో బ్యాంకుల కఠిన నిబంధనలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?:
క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, జరిమానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది:
ఇవి కూడా చదవండి
గ్రేస్ పీరియడ్ : డ్యూ డేట్ పూర్తయిన తర్వాత కూడా వినియోగదారులకు కనీసం 3 రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. ఈ సమయంలో చెల్లిస్తే ఎలాంటి ఆలస్య రుసుము విధించకూడదు.
కనీస బకాయిల విధానం: బకాయి మొత్తం చాలా తక్కువగా (ఉదాహరణకు రూ. 100 కంటే తక్కువ) ఉన్నప్పుడు, లేదా బిల్లులో గణనీయమైన భాగం చెల్లించినప్పుడు బ్యాంకులు భారీ జరిమానాలు విధించకుండా వడ్డీని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
పారదర్శకత: కార్డ్ హోల్డర్కు లేట్ ఫీజు విధించే ముందు స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.
Hdfc Credit Card
కస్టమర్లు ఏం చేయాలి?
ఇలాంటి అనవసర జరిమానాలు పడినప్పుడు వినియోగదారులు వెంటనే సదరు బ్యాంక్ కస్టమర్ కేర్ను సంప్రదించి, పరిస్థితిని వివరించి ఆ ఛార్జీలను రద్దు చేయమని కోరవచ్చు. బ్యాంక్ స్పందించకపోతే లేదా నిరాకరిస్తే, ఆర్బీఐ కింద ఉన్న రైల్వే/బ్యాంకింగ్ అంబుడ్స్మన్ కు ఫిర్యాదు చేసే హక్కు కస్టమర్లకు ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించేటప్పుడు టోటల్ అమౌంట్ డ్యూ మొత్తాన్ని పైసలతో సహా పూర్తిగా చెల్లించడం శ్రేయస్కరం.