Headlines

పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌! | Rare Chandipura Virus Sparks Alarm in Gujarat, Children Among Worst Affected video tv9d

పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌! | Rare Chandipura Virus Sparks Alarm in Gujarat, Children Among Worst Affected video tv9d


భారీ వర్షాలతో అతలాకుతలమైన గుజరాత్‌ను ఇప్పుడు ఓ భయంకరమైన మహమ్మారి వణికిస్తోంది. గుజరాత్‌లో అరుదైన ‘చాందీపురా’ వైరస్ విరుచుకుపడుతోంది. ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ వైరస్ వల్ల ఇప్పటికే 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్ పాన్షేరియా కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 184 మంది అనుమానితులకు రక్తపరీక్షలు నిర్వహించగా, 35 మందికి చాందీపురా వైరస్ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం ఏడుగురు బాధితులు ఐసీయూలో వెంటిలేటర్లపై ఉన్నారు. ఆక్సిజన్ సాయంతో సూపర్ స్పెషాలిటీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గాంధీనగర్, సబర్కాంత, పటాన్, రాజ్‌కోట్, భావ్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. 1965లో మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో తొలిసారిగా గుర్తించిన ఈ వైరస్‌కు ఇసుక ఈగలు ప్రధాన వాహకాలుగా పనిచేస్తున్నాయి. ఇసుక ఈగ కాటు వల్ల వ్యాపించే ఈ వైరస్, పిల్లల్లో తీవ్రమైన మెదడు వాపునకు దారితీస్తుంది. అధిక జ్వరం, వాంతులు, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం ఈ వైరస్‌ ప్రధాన లక్షణాలు. ఈ వైరస్‌కు నిర్దిష్టమైన వ్యాక్సిన్ కానీ, యాంటీవైరల్ మందులు కానీ లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు. దీంతో నివారణే ఏకైక మార్గమని వైద్యులు చెబుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మట్టి ఇళ్ల పగుళ్లను మూసివేయాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామాల్లో విస్తృతంగా పురుగుమందుల పిచికారీ చేస్తున్నారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైకి.. కిట్‌ కాట్‌ చాక్లెట్ ప్యాకెట్‌.. ఓపెన్‌ చేస్తే కళ్లు జిగేల్‌!

కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!

త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!

నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్!

రూ.8000 కోట్ల డిపాజిట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *