ఇక సనాతన ధర్మ ప్రకారం, శ్రావణ మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు, ఉదయం , సాయంత్రం స్నానాలు ఆచరించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, తులసి మాత దగ్గర ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తుంటారు. ఇలా చేయడం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా ప్రతి కూల శక్తి తొలిగిపోయి, సానుకూలత పెరిగి, అనుకున్న పనులు నెరవేరతాయి అంటారు.