మరోవైపు జమ్మూకశ్మీర్లో ఆగస్టు 20 వరకు విడతల వారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండటంతో రైతుల్లో మరింత ఆందోళన పెరిగింది. ముఖ్యంగా ఆపిల్ పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు, వడగళ్లు మరింత నష్టం చేస్తాయేమోనని రైతులు భయపడుతున్నారు.