ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్కు బ్యాటింగ్ అతిపెద్ద తలనొప్పిలా తయారైంది. ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్న ప్రతీ బ్యాట్స్మన్ నిరాశపరిచాడు. ప్రత్యేకంగా జట్టులోకి మరీ పిలిచిన యువ ఓపెనర్ సామ్ అయూబ్ కూడా పరిస్థితిని మార్చడంలో విఫలమయ్యాడు.
బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టుకు పాకిస్థాన్ జట్టులోకి సామ్ అయూబ్ను తీసుకున్నారు. అయితే, అతను రెండు ఇన్నింగ్స్లలోనూ పరుగులు చేయడంలో దారుణంగా విఫలమయ్యాడు.
ఈ టెస్టుకు కొద్ది రోజుల ముందు, సామ్ అయూబ్ వెస్టిండీస్లో కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. ఈక్రమంలో 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంగ్లాండ్లో ఆడేందుకు పిలుపు అందుకున్నాడు. అక్కడ అతని టెస్టు పునరాగమనం పేలవంగా మారింది. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఓలీ రాబిన్సన్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
ఇలాంటి చెత్త ఫాంలో ఉన్నా సామ్ అయూబ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి సుమారు 150,000 పాకిస్తానీ రూపాయలు (PKR) మన కరెన్సీలో సుమారు 5,50,000లు అందుకోనున్నాడు.
దీనికి కారణం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్దేశించిన మ్యాచ్ ఫీజు ప్రకారం, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడినందుకు సామ్ అయూబ్కు 1.5 మిలియన్ల పాకిస్తానీ రూపాయలు లభిస్తాయన్నమాట.




