Headlines

cwcuppal@gmail.com

దారుణం.. భోజనం ఆలస్యమైందని… వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది..! | Bihar: Young Man Beheads Sister In Law Over Delay In Serving Food in Jehanabad District

దారుణం.. భోజనం ఆలస్యమైందని… వదిన తల నరికి చెట్టుకు వేలాడదీసిన మరిది..! | Bihar: Young Man Beheads Sister In Law Over Delay In Serving Food in Jehanabad District

బీహార్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జెహానాబాద్ జిల్లా పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్‌పూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన వదినను గొడ్డలితో హత్య చేసి, అనంతరం ఆమె తలను నరికి ఇంటి ముందున్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ అమానుష ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మృతురాలిని ధర్మేంద్ర కుమార్ భార్య, 25 ఏళ్ల అన్షు దేవిగా పోలీసులు గుర్తించారు. గ్రామస్థుల కథనం ప్రకారం, నిందితుడు కునాల్ కుమార్ మాదకద్రవ్యాలకు బానిస….

Read Full News
ఒక్క గ్లాస్ చాలు.. ఎంతటి భయంకరమైన మొల్లలు, ఫైల్స్ అయినా ఇట్టే తగ్గుతాయ్..

ఒక్క గ్లాస్ చాలు.. ఎంతటి భయంకరమైన మొల్లలు, ఫైల్స్ అయినా ఇట్టే తగ్గుతాయ్..

దేశంలో చాలా మంది ఫైల్స్ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ సమస్యను ఎవరికీ చెప్పుకోలేరు కూడా ఎందుకంటే అంత ఇబ్బంది పడుతుంది. దీని కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి, అస్సలు లేట్ చేయకుండా ఇదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ముందుగా మీరు ఒక గ్లాస్ నీరు తీసుకుని దీనిలో నిమ్మరసం, కొద్దిగా పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి తీసుకోవడం వలన హైడ్రేషన్ కూడా…

Read Full News
Pulasa Fish: ఆయ్.. గోదారోళ్ల దిల్ కుష్.. తొలి పులస చిక్కింది.. రేటు ఎంత పలికిందంటే..? | The Pulasa fish sold for rs 14500 in Yanam, Ambedkar Konaseema district

Pulasa Fish: ఆయ్.. గోదారోళ్ల దిల్ కుష్.. తొలి పులస చిక్కింది.. రేటు ఎంత పలికిందంటే..? | The Pulasa fish sold for rs 14500 in Yanam, Ambedkar Konaseema district

అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పులస చేపల సీజన్ మొదలైంది. గోదావరికి ఎర్రనీరు చేరడంతో ఈ ఏడాది తొలి పులస చేప యానాం మార్కెట్‌కు చేరింది. సుమారు కిలోన్నర బరువున్న ఈ పులస యానాం సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కింది. దీంతో మత్స్యకారుల్లో ఆనందం నెలకొంది. యానాం చేపల మార్కెట్‌లో జరిగిన వేలంలో ఈ తొలి పులసను మత్స్యకార దంపతులు పోనమండ భద్రం, రత్నం 14 వేల రూపాయలకు దక్కించుకున్నారు….

Read Full News
Ramayana Trailer: దూసుకుపోతున్న రామాయణ ట్రైలర్.. మూడు గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ | Ramayana trailer is garnering massive views within just three hours of its release

Ramayana Trailer: దూసుకుపోతున్న రామాయణ ట్రైలర్.. మూడు గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ | Ramayana trailer is garnering massive views within just three hours of its release

మోస్ట్ అవైటెడ్ రామాయణ సినిమా ట్రైలర్ విడుదలైంది.. ట్రైలర్ అంతా విజువల్ మాయాజాలమే ఉంది. టీజర్‌లో కొన్ని విజువల్స్ వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ సీరియస్‌గా తీసుకున్నారు మేకర్స్.. కచ్చితంగా ట్రైలర్ అయితే నెక్ట్స్ లెవల్ విజువల్ ఫీస్ట్ ఇచ్చింది.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి బాగున్నారు.. కానీ ట్రైలర్‌ను డామినేట్ చేసింది మాత్రం కచ్చితంగా రావణుడే.. అంటే యశ్. ఈ సినిమాపై ఆయన ఎందుకంత నమ్మకంగా ఉన్నారనేది ట్రైలర్ చూసాక అర్థమైపోతుంది. అయితే ట్రైలర్…

Read Full News
Telangana: విద్యుత్‌ షాక్‌తో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా పెంపు.. TGSPDCL కీలక ప్రకటన | Telangana: TGSPDCL increases ex gratia for electrocution deaths to Rs 8Laks

Telangana: విద్యుత్‌ షాక్‌తో మరణిస్తే ఎక్స్‌గ్రేషియా పెంపు.. TGSPDCL కీలక ప్రకటన | Telangana: TGSPDCL increases ex gratia for electrocution deaths to Rs 8Laks

TGSPDCL: తెలంగాణ దక్షిణ విద్యుత్ సరఫరా సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) మంగళవారం కీలక ప్రకటన చేసింది. విద్యుదాఘాత మరణాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని రూ. 8 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సంభవించిన మరణాలకు వర్తిస్తుంది. గతంలో విద్యుదాఘాత మరణాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియా మొత్తం రూ. 5 లక్షలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని చట్టబద్ధమైన వారసుడికి చెల్లించాల్సి…

Read Full News
ఘోర రోడ్డు ప్రమాదం.. అందరు చూస్తుండగానే కారులో డ్రైవర్ సజీవ దహనం..! | Horrific road accident: Car and lorry collide, driver burned alive in Kothakota, Anantapur district

ఘోర రోడ్డు ప్రమాదం.. అందరు చూస్తుండగానే కారులో డ్రైవర్ సజీవ దహనం..! | Horrific road accident: Car and lorry collide, driver burned alive in Kothakota, Anantapur district

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్న డ్రైవర్ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. దీంతో అతడు కారులోనే సజీవ దహనమయ్యాడు. గుత్తి మండలం కొత్తకోట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే…

Read Full News
Telangana: అత్యంత అరుదైనది.. అందమైనది.. కొంపదీసి తినేరు.. ఖతం అంతే..

Telangana: అత్యంత అరుదైనది.. అందమైనది.. కొంపదీసి తినేరు.. ఖతం అంతే..

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో అత్యంత అరుదైన 'క్లార్కిఇండా ట్రాకోడెస్' అనే అడవి పుట్టగొడుగును గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య గుర్తించారు. అగారికేసి కుటుంబానికి చెందిన ఈ పుట్టగొడుగు తెలంగాణ రాష్ట్రంలో నమోదవడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. జీవవైవిధ్య పరిశోధనలో భాగంగా నిర్వహించిన పరిశీలనల్లో ఈ పుట్టగొడుగు కనిపించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శిలీంద్ర శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోహరాచారి…

Read Full News
ఈ20 పెట్రోల్.. ఇంజిన్‌కు ముప్పా.. మైలేజీ తగ్గుతుందా.. నిజమేంటీ? | Does E20 Petrol Reduce Mileage Or Damage Your Car? Minister Nitin Gadkari Clarified To Viral Claims

ఈ20 పెట్రోల్.. ఇంజిన్‌కు ముప్పా.. మైలేజీ తగ్గుతుందా.. నిజమేంటీ? | Does E20 Petrol Reduce Mileage Or Damage Your Car? Minister Nitin Gadkari Clarified To Viral Claims

దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌పై మరోసారి చర్చ జోరందుకుంది. ఇథనాల్‌ను 20 శాతం వరకు కలిపిన ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల పనితీరుపై ప్రభావం పడుతోందంటూ పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ భయాలు అవసరం లేదని స్పష్టం చేస్తోంది. తాజాగా కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ20 పెట్రోల్ వినియోగంపై మరోసారి వివరణ ఇచ్చారు. బీఎస్-3 పెట్రోల్ వాహనాల్లో ఈ20 ఇంధనం…

Read Full News
హై ప్రొటీన్ శనగ-పెసర చిలా.. ఉదయాన్నే తినాల్సిన ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ! | High Protein Chickpea And Green Gram Chilla: The Perfect Healthy Breakfast Recipe

హై ప్రొటీన్ శనగ-పెసర చిలా.. ఉదయాన్నే తినాల్సిన ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ! | High Protein Chickpea And Green Gram Chilla: The Perfect Healthy Breakfast Recipe

ఉదయాన్నే ఆరోగ్యకరమైన, ప్రొటీన్లు సమృద్ధిగా లభించే అల్పాహారం కోసం శనగ-పెసర చిలా అద్భుతమైన ఎంపిక. రాత్రంతా నానబెట్టిన నల్ల శనగలు, పొట్టు పెసళ్లతో తయారుచేసే ఈ చిలాలో పీచుపదార్థాలు, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి రోజంతా కావలసిన శక్తిని అందించడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. సులభంగా, తక్కువ సమయంలో ఇంట్లోనే తయారుచేసుకోగలిగే ఈ పౌష్టికాహార వంటకం జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. దీనిని పుదీనా…

Read Full News
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి విమర్శలు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ | Kishan Reddy Slams Rahul Gandhi Over Lok Sabha Remarks, Demands Unconditional Apology

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి విమర్శలు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ | Kishan Reddy Slams Rahul Gandhi Over Lok Sabha Remarks, Demands Unconditional Apology

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ పలుమార్లు ‘ఇడియట్’ వంటి పదాన్ని ఉపయోగించడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. ఇటీవలి విద్యార్థుల ఆందోళనలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం విఫలమైన నేపథ్యంలో, రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆధారరహిత విమర్శలు…

Read Full News