పట్టపగలు ఇంట్లోకి చొరబడి.. మహిళలు, వృద్ధులపై దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో భూ వివాదం నేపథ్యంలో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఎలావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గరివార్ గ్రామంలో కొందరు వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడి మహిళలు, వృద్ధులపై దాడి చేశారని, వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేశారు. ఏడు గేదెలను బలవంతంగా తీసుకెళ్లారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనపై న్యాయం కోరుతూ బాధితులు మైన్పురి పోలీస్ సూపరింటెండెంట్ను ఆశ్రయించారు. బాధితుడు రాహుల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, జూలై 21, 2026న ఉదయం సుమారు…