భూమి నుంచి ఆకాశం వరకు పరమశివుని పంచభూత క్షేత్రాలు.. జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే! | Pancha Bhoota Shiva Temples: 5 Sacred Shrines Representing Nature’s Five Elements
భారతీయ సనాతన సంప్రదాయంలో ‘పంచభూతాలు’ అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదు మూల తత్వాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ విశ్వంలోని ప్రతి జీవి, ప్రతి వస్తువు ఈ ఐదు తత్వాల సమ్మేళనమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పంచభూతాల స్వరూపంగానే పరమశివుడు కొలువై ఉన్న ఐదు పవిత్ర ఆలయాలను పంచభూత క్షేత్రాలు అని పిలుస్తారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ఐదు ప్రాచీన శైవక్షేత్రాలు భక్తి, తత్వశాస్త్రం, ప్రకృతి, ద్రావిడ…