Ishan Kishan and Vaibhav Sooryavanshi DRS Blunder: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్లో భారత కీపర్ ఇషాన్ కిషన్, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీలు చేసిన డీఆర్ఎస్ బ్లండర్ మిస్టేక్ ప్రత్యర్థి బ్యాటర్ బ్రయాన్ బెన్నెట్కు ఊహించని లైఫ్లైన్ లభించింది. బంతి స్పష్టంగా బ్యాట్ను తాకి వెళ్లినా భారత్ అపీల్ చేయకపోవడం, రివ్యూ తీసుకోకపోవడం మైదానంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
డీఆర్ఎస్ ఘోర బ్లండర్: అసలేం జరిగింది..?
హరారే వేదికగా శనివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో జింబాబ్వే ఛేజింగ్ ఆరంభంలోనే ఒక ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే భారత స్పీడ్స్టర్ మయాంక్ యాదవ్ విసిరిన షార్ట్ లెంగ్త్ బంతిని జింబాబ్వే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ కట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి స్పష్టంగా అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతులకు సమీపం నుంచి వెళ్ళిపోయింది.
అయితే, బ్యాట్ను తాకుతూ వెళ్లిన సదరు బంతి శబ్దాన్ని కీపర్ ఇషాన్ కిషన్ గానీ, దగ్గరలో ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ గానీ సరిగ్గా అంచనా వేయలేకపోయారు. టీమిండియా ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయకపోవడంతో అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. భారత్ రివ్యూ తీసుకోకూడదని నిర్ణయించుకుంది. తీరా బిగ్ స్క్రీన్పై రీప్లే ప్లే చేసినప్పుడు స్పష్టంగా ఎడ్జ్ అయినట్లు కనిపించడంతో కీపర్ ఇషాన్, సూర్యవంశీలతో పాటు భారత ఆటగాళ్లంతా అవాక్కయ్యారు.
తిలక్ వర్మ క్యాచ్ డ్రాప్: వరుస అవకాశాలు పొందిన బెన్నెట్..!
— crictalk (@crictalk7) July 25, 2026
ఈ డీఆర్ఎస్ మిస్తో మొదటి జీవితకాలాన్ని పొందిన బ్రయాన్ బెన్నెట్కు వెంటనే మరో అవకాశం కూడా లభించింది. షార్ట్ ఎక్స్ట్రా కవర్ దిశగా బెన్నెట్ కొట్టిన కష్టమైన షాట్ను భారత ఆల్ రౌండర్ తిలక్ వర్మ అందుకోవడంలో విఫలమై క్యాచ్ను జారవిడిచాడు. ఇలా వరుసగా రెండు పెద్ద లైఫ్లైన్లు లభించినప్పటికీ, బెన్నెట్ దానిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు.
అరంగేట్ర బౌలర్ యశ్ ఠాకూర్ ధాటికి బెన్నెట్ 19 బంతుల్లో 32 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. రెండు సార్లు బతికిపోయినప్పటికీ బెన్నెట్ భారత్కు పెద్దగా ప్రమాదకరంగా మారకపోవడం విశేషం.
ఇషాన్ కిషన్, తిలక్ వర్మల విధ్వంసం..!
అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వేకు భారత బ్యాటర్లు చుక్కలు చూపించారు. వైభవ్ సూర్యవంశీ కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, ఆ తర్వాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు జింబాబ్వే బౌలర్లపై దండయాత్ర చేశారు. ఇషాన్ కిషన్ కేవలం 44 బంతుల్లో 81 పరుగులు చేసి తుఫాన్ హాఫ్ సెంచరీ సాధించాడు.
మరోవైపు తిలక్ వర్మ కేవలం 29 బంతుల్లోనే 60 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ల పుణ్యమా అని భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించి, జింబాబ్వే ముందు 220 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..