ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్ల మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.