హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యామండలి మరోసారి అవకాశం కల్పించింది. ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును సెప్టెంబరు 7 వరకు పొడిగిస్తూ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పొడిగించిన గడువు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, గురుకులాలు, మోడల్ స్కూళ్లలోని జూనియర్ కాలేజీలకు వర్తిస్తుంది. దీంతో ఇప్పటివరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
సెప్టెంబరు 7 వరకు అవకాశం
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు సెప్టెంబరు 7, 2026లోపు సంబంధిత కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. గడువు మరోసారి పొడిగించిన నేపథ్యంలో విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా త్వరగా ప్రవేశాలు పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ అడ్మిషన్ గడువు పెంపు రాష్ట్రంలోని అన్ని సంబంధిత కాలేజీలకు వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ కాలేజీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల వివరాలు, కాలేజీల జాబితాను అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఇందుకోసం వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం ఇంకా పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సెప్టెంబరు 7లోపు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు ఇక్కడ క్లిక్ చేయండి.