వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు
సాంకేతిక ఆధారాలతో కేవలం 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి, సుమారు రూ.75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను కడప తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ చోరీకి పాల్పడింది బాధితురాలి సొంత మనవడేనని దర్యాప్తులో తేలడంతో స్థానికంగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కడప నగరంలోని విజయదుర్గా కాలనీలో ఉన్న శ్రీ విజయదుర్గా రెసిడెన్సీ, ప్లాట్ నెం. 314లో నివాసముంటున్న సీనియర్ సిటిజన్ కుప్పం లీలావతమ్మ డయల్-100కు ఫోన్ చేసి, తన ఇంటి తాళాలు…