అసలు ఆర్బీఐ మార్చిన నిబంధన ఏమిటి?: గతంలో బ్యాంకులు రూ. 2 కోట్ల వరకు ఉండే డిపాజిట్లను ‘రిటైల్ డిపాజిట్లు’గాను, రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లను ‘బల్క్ డిపాజిట్లు’గా పరిగణిస్తారు. అయితే, మారిన నిబంధనల ప్రకారం బల్క్ డిపాజిట్ల పరిమితిని రూ. 3 కోట్లకు ప్రతిపాదించడం, పెంచడం జరిగింది. దీనితో పాటు బల్క్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో వ్యత్యాసం చూపించడానికి బ్యాంకింగ్ రంగానికి స్పష్టమైన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ జారీ చేసింది. బల్క్ డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతి రోజు ఉదయం 10 గంటల, 10 నిమిషాల గ్రేస్ టైమ్తో, గరిష్టంగా 10:10 గంటల్లోపు బ్యాంకు వెబ్సైట్లో వెల్లడించాలని అని ఆర్బిఐ తన సర్క్యులర్లో పేర్కొంది.