Telangana: తెలంగాణ స్టూడెంట్స్కు గుడ్న్యూస్.. నవంబర్లోగా అందరికీ ఉచిత అల్పాహారం
ఉదయం పూట ఆకలితో తరగతులకు వచ్చే విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపడంతోపాటు వారికి పౌష్టికాహారం అందించడం, పాఠశాలల హాజరు శాతాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంటోంది. దశలవారీగా అమలు చేస్తున్న ఈ పథకంలో ప్రస్తుతం రెండు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. తొలి దశలో జూన్ నెలలో ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రీకృత వంటశాలల ద్వారా 1,269 ప్రభుత్వ పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీలకు అల్పాహారం సరఫరా ప్రారంభించారు. ఈ…