Headlines

Tarun-Aarthi Agarwal : ఆ పాట చేస్తున్నప్పుడు తరుణ్, ఆర్తి అగర్వాల్ మధ్య మాటలు లేవు.. కట్ చేస్తే.. ఇప్పటికీ తగ్గని డిమాండ్ .. | Director Kasi Viswanath Shares Nuvvu Leka Nenu Lenu Movie Facts and Nindu Godari Kada Song


ప్రముఖ దర్శకుడు కాశీ విశ్వనాథ్, తన సూపర్ హిట్ చిత్రం నువ్వు లేక నేను లేను నిర్మాణంలో నటీనటులు తరుణ్, ఆర్తీ అగర్వాల్‌లతో పంచుకున్న ఆసక్తికర అనుభవాలను ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో వెల్లడించారు. ఈ చిత్రానికి ఆర్తీ అగర్వాల్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న కథను, ఆమెతో పని చేస్తున్నప్పుడు ఎదురైన సవాళ్లను, అలాగే చిత్ర గీతాల విశేషాలను ఆయన వివరించారు. మొదట, ఈ సినిమాకు హీరోయిన్‌గా మంజుల కుమార్తె శ్రీదేవిని అనుకున్నట్లు కాశీ విశ్వనాథ్ తెలిపారు. మద్రాస్‌కు వెళ్లి కథ చెప్పి, ఆమె అంగీకరించిన తర్వాత, నిర్మాత సురేష్ బాబు ఒక రోజు పిలిచి కీలక మార్పును సూచించారని ఆయన గుర్తుచేసుకున్నారు. “నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఆర్తీ అగర్వాల్‌కి సూపర్ హిట్ వచ్చింది. ఆమె మన చేతిలో ఉంది, మన సినిమా చేస్తే ఎలా ఉంటుంది?” అని సురేష్ బాబు అడిగినట్లు కాశీ విశ్వనాథ్ చెప్పారు. అద్భుతంగా ఉంటుందని చెప్పడంతో, సురేష్ బాబు మార్కెటింగ్ స్కిల్స్‌తో ఆర్తీ అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు వివరించారు.

ఆర్తీ అగర్వాల్‌కు అప్పట్లో తెలుగు సరిగా రాదు. కాబట్టి, దర్శకుడిగా కాశీ విశ్వనాథ్ ఆమెకు డైలాగులు నేర్పే బాధ్యతను తీసుకున్నారు. ప్రతి సాయంత్రం ఒక గంటపాటు ఆమెతో కలిసి సన్నివేశాలను ప్రాక్టీస్ చేయించి, తెలుగు డైలాగులను చెప్పించేవారట. అంతేకాకుండా, ఆర్తీ తండ్రి అగర్వాల్ కుమార్తెను ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేయడానికి ఇష్టపడేవారు కాదని, సెంటిమెంట్‌గా ఆమెను కాపాడుకోవాలని చూసేవారని కాశీ విశ్వనాథ్ చెప్పారు. అయితే, క్యారెక్టర్‌కు న్యాయం చేయడానికి కొన్ని సన్నిహిత సన్నివేశాలు అవసరమయ్యాయి. అలాంటి సమయాల్లో, దర్శకుడిగా సన్నివేశం పర్ఫెక్ట్‌గా రావాలనే ఉద్దేశంతో, ఆర్తీ తండ్రిని వేరే కారులో పంపించి, డ్రైవర్‌ను ఆలస్యంగా తీసుకురామని చెప్పి, ఆ లోపు సన్నివేశాలను చిత్రీకరించేవారట. ఇలాంటి సంఘటనలతో యూనిట్ అంతా “అతను ఉంటే చేయనివ్వడు ఈ సీను” అని సరదాగా అనుకునేవారని ఆయన గుర్తుచేసుకున్నారు.

నిండు గోదారి కథ పాట చిత్రీకరణ కోసం రాజమండ్రి వెళ్లే ముందు తరుణ్, ఆర్తీ అగర్వాల్‌ల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తాయని, వారు మాట్లాడుకోవడం మానేశారని కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. అయితే, ఆ పాట ఎక్స్‌ప్రెసివ్‌గా రావాలంటే వారిద్దరూ కలిసికట్టుగా నటించడం అవసరమని గ్రహించి, రాజమండ్రి వెళ్లే రైలు ప్రయాణంలో వారందరూ ఒకే కూపేలో ఉండేలా చూసి, తాను స్వయంగా వారిద్దరినీ ఒప్పించి, మాట్లాడించి మళ్లీ కలిపారని ఆయన వివరించారు. ఈ సంఘటన వల్ల పాట స్క్రీన్‌పై అద్భుతంగా పండిందని, సినిమా విజయానికి అది కూడా ఒక కారణమని ఆయన పేర్కొన్నారు.

నువ్వు లేక నేను లేను చిత్రానికి సంగీతం ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచిందని కాశీ విశ్వనాథ్ తెలిపారు. ఆర్.పి. పట్నాయక్ సంగీతం, కులశేఖర్ గారు రాసిన నిండు గోదారి కథ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని ఆయన చెప్పారు. “ఎలా ఎలా తెలుపను” అనే పాట వెనుక ఉన్న కథను కూడా ఆయన పంచుకున్నారు. ఆ పాటను చంద్రబోస్ గారు రాశారని, అయితే ఆ పాట యొక్క సిట్యుయేషన్ (హీరోయిన్ తన ప్రేమను హీరోకి చెప్పలేక తపన పడే ఫీలింగ్) తాను వివరించినట్లు తెలిపారు. ఈ పాట కళాశాలల్లో అమ్మాయిలు ఎక్కువగా నృత్యం చేయడానికి ఉపయోగించుకునేవారని, తమ ప్రేమను వ్యక్తం చేయడానికి వారికి తక్కువ పాటలు ఉన్నందున, ఈ పాటను ఓన్ చేసుకున్నారని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

నిండు గోదారి కథ సాంగ్..



ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *