బంగారం ధరలపై బ్యాడ్ న్యూస్. గత కొద్ది రోజుల తగ్గుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఉన్నట్లుండి పసిడి ధరలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కొద్ది రోజులుగా గోల్డ్ రేట్లు పతనమవుతుండటంతో.. కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు పెరుగుతుండటంతో.. మళ్లీ వెనక్కి తగ్గుతున్నారు. ఈ పెరుగుదల తర్వాత సెప్టెంబర్ 3న వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,350 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ రూ.3330 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,400గా ఉండగా.. ఒక్కరోజే రూ.3050 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లో 24 క్యారెట్ల ధర రూ.1,55,350 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,400 వద్ద ట్రేడవుతోంది. బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,500గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,550గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,010 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39.340గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,49,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.2.50 లక్షలుగా ఉంది. చెన్నైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.45 లక్షల వద్ద కొనసాగింది. ఇవాళ రూ.5 వేల మేర పెరిగింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉంది. నిన్న ఈ ధర రూ.2.45 లక్షలుగా ఉంది. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.




