హైదరాబాద్ కంటోన్మెంట్లో కలకలం.. మద్రాస్ రెజిమెంట్లో 12 తుపాకుల చోరీ..
హైదరాబాద్ కంటోన్మెంట్ మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ కలకలం రేపింది.. అత్యంత భద్రత ఉన్న ఆయుధాల గది తాళాన్ని పగులగొట్టి.. 12 ఆయుధాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. నాలుగు ఏకే47లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ అపహరించారు. ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి కూడా చోరీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి దొంగతనం జరిగినట్టు గుర్తించిన మద్రాస్ రెజిమెంట్ అధికారులు.. సోమవారం ఉదయం బొల్లారం పీఎస్లో ఫిర్యాదు చేశారు.. ఇది ఆర్మీకి ఓరకంగా షాకింగ్…