ప్రధాని మోదీకి థింసా నృత్యంతో స్వాగతం..! ఏకంగా 13,500 మందితో.. | PM Narendra Modi to Inaugurate Alluri Sitarama Raju International Airport in Visakhapatnam, Grand Tribal Thinsa Dance Welcome Planned
విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గిరిజన సంప్రదాయ థింసా నృత్యంతో అపూర్వ స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు ఏకరూప దుస్తుల్లో థింసా నృత్యం ప్రదర్శించనుండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 10.58 గంటలకు ప్రారంభం షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఉదయం…