Headlines
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. ఆ ఒక్క కారణంతో మిస్..? | Why mayank yadav won player of the match over vaibhav sooryavanshi ind vs zim 1st t20i

రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. ఆ ఒక్క కారణంతో మిస్..? | Why mayank yadav won player of the match over vaibhav sooryavanshi ind vs zim 1st t20i

Mayank Yadav Player of the Match: 126 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. సీనియర్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగుకే అవుటయ్యాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలోని వికెట్ బ్యాటింగ్‌కు ఎంతో కష్టతరంగా మారింది. బంతి అనూహ్యంగా ఎగిసిపడుతూ, కొద్దిగా స్వింగ్ అవుతుండటంతో బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం భయపడకుండా జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొట్టాడు. 50…

Read Full News
Telangana: శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..

Telangana: శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..

దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ ప్రవేశ పరీక్ష అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు ఇప్పుడు విద్యార్థి లోకంలో తీవ్ర అగ్గి రాజేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలకు నిరసనగా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విద్యార్థి సంఘాలు ఐక్యపోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 24 శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల బంద్‌కు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ వంటి ప్రధాన విద్యార్థి సంఘాల నేతలు హైదరాబాద్‌లో సంయుక్త…

Read Full News
Viral Video: ఒకే కెమెరామ్యాన్‌ను ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారట.. వైరల్ వీడియో.. నిజమేనా? | Uttar pradesh: amroha sisters marrying cameraman case gone viral on social media

Viral Video: ఒకే కెమెరామ్యాన్‌ను ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారట.. వైరల్ వీడియో.. నిజమేనా? | Uttar pradesh: amroha sisters marrying cameraman case gone viral on social media

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ సంప్రదాయాల ప్రకారం ముగ్గురు అక్కాచెల్లెల్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ వివాహం జరిగినట్లు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో వైరల్ అవుతున్న సమాచారాన్ని స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. ఈ ఘటన అమ్రోహా జిల్లా హసన్‌పూర్ నియోజకవర్గంలోని ధౌరియా గ్రామానికి చెందినదిగా ప్రచారం జరుగుతోంది. రైతు రమేష్‌కు చెందిన సరోజ్,…

Read Full News
కప్పలు నీళ్లు తాగటం ఎప్పుడైనా చూశారా..? అవి ఎలా దాహం తీర్చుకుంటాయో తెలిస్తే..

కప్పలు నీళ్లు తాగటం ఎప్పుడైనా చూశారా..? అవి ఎలా దాహం తీర్చుకుంటాయో తెలిస్తే..

కప్పలు నోటి ద్వారా నీటిని తాగవని, తమ ప్రత్యేకమైన చర్మం ద్వారా నీటిని శరీరంలోకి పీల్చుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా కప్పలకు చర్మం తడిగా ఉండటం చాలా ముఖ్యం. చర్మం ఎండిపోతే అవి ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోతాయి. ఏమిటీ డ్రింకింగ్ ప్యాచ్?: కప్పల శరీర నిర్మాణం ఎంతో విచిత్రంగా ఉంటుంది. వీటి పొట్ట కింది భాగంలో మరియు వెనుక కాళ్ల దగ్గర చర్మం చాలా పల్చగా, మెత్తగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన…

Read Full News
Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం! | Chaturmas 2026: Vastu Tips to Invite Positive Energy and Prosperity at Home

Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం! | Chaturmas 2026: Vastu Tips to Invite Positive Energy and Prosperity at Home

Chaturmas Vastu Tips Telugu: హిందూ సంప్రదాయంలో చాతుర్మాసం అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన కాలంగా భావిస్తారు. ఈ నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని, ఈ సమయంలో సృష్టి నిర్వహణ బాధ్యతలను పరమశివుడు చేపడతారని పురాణాల్లో పేర్కొంటారు. అందుకే ఈ కాలంలో పూజలు, జపం, తపస్సు, ధ్యానం, దానధర్మాలు వంటి ఆధ్యాత్మిక కార్యాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు. ఈ ఏడాది చాతుర్మాసం జూలై 25న ప్రారంభమై,…

Read Full News
Kajal Aggarwal: అతను సడెన్‌గా నా క్యారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసి.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ కాజల్ | Actress Kajal Aggarwal Recalls Shocking Incident With Her Fan During Movie Shoot

Kajal Aggarwal: అతను సడెన్‌గా నా క్యారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసి.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ కాజల్ | Actress Kajal Aggarwal Recalls Shocking Incident With Her Fan During Movie Shoot

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేస్తోంది. పెళ్లి, పిల్లలైన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు వరుసగా హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది కాజల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ శుక్రవారం (జూలై 24)న విడుదల కానుంది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో . శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా,…

Read Full News
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుంది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాలి.. | Why You Should Never Drink Water While Eating, Check Side Effects and Health Risks

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుంది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాలి.. | Why You Should Never Drink Water While Eating, Check Side Effects and Health Risks

ఆహారం ఎంత ముఖ్యమో మన శరీరానికి నీళ్లు కూడా అంతే ముఖ్యం. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలామందికి భోజనం తింటున్న సమయంలో తరచుగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది భోజనంతో పాటు మధ్యమధ్యలో నీరు తాగుతుంటారు. కానీ సైన్స్, ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ చిన్న అలవాటు మీ జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని…

Read Full News
అగ్నివీర్‌గా ఇంటికొచ్చిన కొడుకు.. తండ్రి చేసిన పని చూసి 47 గ్రామాలు ఒక్కటయ్యాయి!

అగ్నివీర్‌గా ఇంటికొచ్చిన కొడుకు.. తండ్రి చేసిన పని చూసి 47 గ్రామాలు ఒక్కటయ్యాయి!

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఓ అగ్నివీర్‌కు గ్రామస్థులు ఇచ్చిన ఘన స్వాగతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రావత్‌భట ప్రాంతంలోని మోహన్‌పురా గ్రామానికి చెందిన యోగేష్ చౌదరి భారత సైన్యంలో అగ్నివీర్‌గా శిక్షణ పూర్తి చేసి, తొలి విధిని విజయవంతంగా నిర్వహించాడు. అనంతరం మొదటిసారిగా స్వగ్రామానికి చేరుకోగా గ్రామస్తులు అతనికి అపూర్వ స్వాగతం పలికారు. యోగేష్ చౌదరి 2025 డిసెంబర్ 27న అగ్నివీర్ పథకం కింద భారత సైన్యంలో ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం తొలి విధిని పూర్తి చేసుకుని…

Read Full News
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం విక్రయం.. పూర్తి వివరాలు ఇవే! | AP Government to Sell Super Fine Rice at ₹52/kg from August 1 to Curb Rising Prices

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం విక్రయం.. పూర్తి వివరాలు ఇవే! | AP Government to Sell Super Fine Rice at ₹52/kg from August 1 to Curb Rising Prices

రాష్ట్రంలో బియ్యం ధరలు నెల నెలా పెరుగుతుండటంతో సామాన్యులపై భారం పెరుగుతోంది. మార్కెట్లో సూపర్ ఫైన్, పచ్చిబియ్యం ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందాయి. ప్రపంచ యుద్ధ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, రవాణా వ్యయాల పెరుగుదల వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం… ఇక నేరుగా మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రైస్ మిల్లర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎందుకు…

Read Full News
COVID-19: మళ్లీ కరోనా కలకలం.. ఏపీలో 32 కేసులు.. మాస్కు లేకుంటే రిస్కేనా? | COVID Cases Rise Again: Should You Start Wearing a Mask video tv9d

COVID-19: మళ్లీ కరోనా కలకలం.. ఏపీలో 32 కేసులు.. మాస్కు లేకుంటే రిస్కేనా? | COVID Cases Rise Again: Should You Start Wearing a Mask video tv9d

దేశంలో వివిధ ప్రాంతాల్లో మళ్లీ కొవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మళ్లీ మాస్క్ వాడాల్సిందేనా.. అనే చర్చ తీవ్రమవుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు మాస్క్ వాడటం శ్రేయస్కరమని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, ఆస్పత్రులకు వెళ్లేవారు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందు జాగ్రత్తగా మాస్క్ వాడటం మంచిదని…

Read Full News