వెలుగులోకి దారుణం.. తల్లిని చంపి.. అన్నకు ఫోటో పంపిన తమ్ముడు..!
తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు తన తల్లిని రోలుతో తలపై కొట్టి హతమార్చాడు. ఈ దారుణ ఘటన తూత్తుకుడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తిరుచెందూర్ సమీపంలోని కుమారపురం జయనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని రిటైర్డ్ కళాశాల ప్రొఫెసర్ రేణుకాదేవి (62)గా గుర్తించారు. నిందితుడైన ఆమె కుమారుడు తంగపాలన్ (27)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకాదేవి, అంబుమణి దంపతులకు ఇద్దరు…