Headlines

గాఢ నిద్రలో ఉలిక్కిపాటు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు..! | Private Bus Catches Fire on NH 44: Hyderabad Bengaluru Route, Driver’s Quick Action Saves Lives

అనంతపురం: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్‌ గల ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో…

Read Full News

గెలాక్సీలో నక్షత్రాలు.. భూమిపై చెట్లు.. ఏవి ఎక్కువగా ఉన్నాయి? IAS క్వశ్చన్ కాదు.. కానీ! | Earth Has More Trees Than Stars in the Milky Way: Shocking Numbers Explained

భూమిపై మనం ఊహించలేనన్ని చెట్లు ఉన్నాయని తెలుసు. కానీ ఆ సంఖ్య మనం నివసిస్తున్న మిల్కీ వే గెలాక్సీలోని నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ అంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై సుమారు 3.04 ట్రిలియన్ చెట్లు ఉండగా, మన పాలపుంతలో సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నట్లు అంచనా. అంటే కనిష్ఠ అంచనాను తీసుకున్నా భూమిపై చెట్లు నక్షత్రాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. భూమిపై ఎన్ని చెట్లు…

Read Full News

Blinkitలో గుడ్లు అర్డర్.. పురుగు ఉందంటూ ఫిర్యాదు.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు! | Blinkit Egg Complaint: Food Safety Officials Inspect Mangaluru Hub, Storage Sealed

మంగళూరు: క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్డర్ చేసిన గుడ్లలో పురుగు కనిపించిందన్న వినియోగదారుడి ఫిర్యాదు కలకలం రేపింది. ఈ ఫిర్యాదుపై కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు మంగళూరులోని Blinkit ఆన్‌లైన్ రిటైల్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఫాల్నిర్ ప్రాంతంలోని ఫాల్నిర్ స్క్వేర్ భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న Blinkit కేంద్రంలో ఈ తనిఖీలు జరిగాయి. గుడ్లలో పురుగు ఉందంటూ ఫిర్యాదు వినియోగదారుడు Blinkit ద్వారా కొన్ని గుడ్లను ఆర్డర్ చేసినట్లు అధికారులు తెలిపారు. డెలివరీ అయిన గుడ్లలో…

Read Full News

Dragon Movie: ఏం ప్లాన్ చేస్తున్నావ్‌ నీల్ మామా! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో ఆ స్టార్ హీరో, హీరోయిన్ కూడా! | Bollywood Actors Shahid Kapoor Alia Bhatt Likely To Join JR NTR Starrer Dragon Movie By Prashanth Neel

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా డ్రాగన్. ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ తో పాటు దక్షిణాది సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానులలో అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్…

Read Full News

కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం.. పాకం లేకుండానే జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ.. పాతకాలం నాటి రెసిపీ ఇదిగో.. | Krishna janmashtami prasadam recipe easy atukula poha prasadam with jaggery naivedyam

శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది హిందూ సంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినం.. శుక్రవారం కృష్ణాష్టమి పండుగ వేడుకలను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అయితే, ఈ శుభదినాన కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలలో అటుకుల ప్రసాదం ఒకటి. దీనిని చాలా తక్కువ సమయంలో, కేవలం పది నుంచి పదిహేను నిమిషాలలోనే రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఈ కథనంలో కృష్ణాష్టమికి ప్రత్యేకమైన ఈ అటుకుల ప్రసాదాన్ని ఇంట్లో సులువుగా, కమ్మగా ఎలా తయారు చేయాలో…

Read Full News

Suriya : సూర్య, మహేష్ బాబుకు మధ్య ఉన్న కామన్ కనెక్షన్ ఏంటో తెలుసా.. ? సినిమాల్లోకి రాకముందే అనుబంధం.. | Do you know what the common connection between Suriya and Mahesh Babu

దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు సూర్య. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపే సూర్య, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాలతో తనకు ఉన్న ప్రత్యేక బంధాన్ని , పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. సూర్య తెలిపిన వివరాల ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు, సంగీత…

Read Full News

Viral Video: వరద నీటిలో షాకింగ్ సీన్.. బండిపై బైక్ పెట్టుకుని వెళ్లిన పోలీసులు! | UP Floods Viral: Police Carry Motorcycle on Cart Through Deluge, Video Shocks Netizens

ఉత్తరప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 23 జిల్లాలను వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు తమ బైక్‌ను బండిపై పెట్టుకుని వరద నీటిని దాటుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, నదుల ఉధృతితో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అధికారుల తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 23 జిల్లాలు ప్రస్తుతం వరద ప్రభావంలో ఉన్నాయి. ఇప్పటికే 16,784 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు….

Read Full News

కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? నీరసం రాకుండా ఉత్సాహంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! | Krishna Janmashtami Fasting Tips: Follow These Rules to Stay Energetic and Healthy

శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుని కృప కోసం చాలామంది రోజంతా ఉపవాస దీక్ష పాటిస్తారు. కొందరు అసలు నీళ్ళు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం ఉంటే, మరికొందరు పండ్లు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం పూర్తి చేస్తారు. అయితే రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసం, అలసట, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భక్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా…

Read Full News

Electric Cars: రూ. 5 లక్షలకే ఎలక్ట్రిక్ కార్.. అదిరిపోయే రేంజ్‌.. మధ్య తరగతి వారికి బెస్ట్‌ ఆప్షన్‌..! | Cars cheapest electric cars in india with baas tata tiago ev mg comet punch ev kia syros ev

MG కామెట్ EV: ఇది రద్దీగా ఉండే నగర ట్రాఫిక్, ఇరుకైన పార్కింగ్‌లో కూడా సులభంగా పార్క్‌ చేసుకునేలా రూపొందించిన ఒక అల్ట్రా-కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు. BaaS మోడల్ ధర రూ.4.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది (అదనపు బ్యాటరీ అద్దె కిలోమీటరుకు సుమారుగా రూ.3.20). దీని ఫ్యూచరిస్టిక్ బాక్సీ డిజైన్, పూర్తి వెడల్పు గల ముందు, వెనుక LED లైట్ బార్‌లు, ఆధునిక టూ-డోర్ లేఅవుట్ దీనికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. దీని ఇంటీరియర్ మినిమలిస్ట్…

Read Full News

దేవుడి సేవలో ‘కోట్ల’ సంపాదన..? తవ్వే కొద్దీ బయటపడుతున్న టీటీడీ డిప్యూటీ ఈవో అక్రమాలు! | TTD Deputy EO Corruption: Mendu Lokanatham’s Rs 5 Cr Illegal Assets Uncovered in ACB Raids

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో క్లర్క్‌గా చేరి డిప్యూటీ ఈవో స్థాయికి ఎదిగిన మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ మొత్తం తేలగా, బహిరంగ మార్కెట్లో దీని విలువ పదుల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతితో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. సుదీర్ఘ…

Read Full News