ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో వరినాట్లు! | After 25 Years, Farmer Cultivates Barren Land as Collector Resolves Long Standing Access Road Issue
ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం లభించింది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలతో రైతు పొలానికి దారి ఏర్పడటంతో.. దాదాపు 25 ఏళ్లుగా బీడుగా ఉన్న భూమిలో ఇప్పుడు వరినాట్లు పడ్డాయి. దీంతో రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. 25 ఏళ్లుగా దారి కోసం ఇబ్బందులు… తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సందిరి రాజుకు సర్వే నంబర్ 173లో 2 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అయితే…