Headlines

500 మీటర్ల దూరంలో ఉన్న కిచ్చా నది.. చూస్తుండగానే ట్యాంక్‌నే మింగేసింది! | Uttar Pradesh: Rs 3.97 Cr Jal Jeevan Mission Water Tank Collapses into Kiccha River in Bareilly

బరేలీ: ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, నదుల ఉధృతితో ప్రభుత్వ అభివృద్ధి పనులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బరేలీ జిల్లాలోని షేర్‌గఢ్‌ బ్లాక్‌ పరిధిలో బైరామ్‌నగర్‌ గ్రామ పంచాయతీలో జల్‌ జీవన్‌ మిషన్‌ కింద నిర్మిస్తున్న ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ కిచ్చా నదిలో మునిగిపోయింది. సుమారు రూ.3.97 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ట్యాంక్‌ నదీ కోతకు గురై కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. గత వారం కిచ్చా నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో…

Read Full News

9/11 విషాదం.. ఆ రోజున షిఫ్ట్ మారడం సిబి ప్రాణాలను కాపాడింది | A Shift Swap That Saved This Man’s Life On 9/11

అంతకు ముందు రెస్టారెంట్‌లో పనిచేసే సహోద్యోగి రివాస్ తో మాట్లాడి సిబి తన షిఫ్ట్‌ను మార్చుకున్నాడు. రివాస్‌కు ఆదివారం సెలవు కావాల్సి ఉండటంతో, సిబి అతనికి బదులుగా పనిచేసేందుకు ఒప్పుకున్నాడు. సీఎన్ఎన్  కథనం ప్రకారం 9/11 ఉదయం  సిబి షిఫ్ట్‌లో రివాస్ విధులకు హాజరయ్యాడు. ప్రాణాలు కోల్పోయిన సహోద్యోగులు ఆ రోజు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో అల్ ఖైదా జరిపిన దాడిలో 2,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో సిబి షిఫ్ట్‌లో పనిచేసిన  రివాస్ కూడా…

Read Full News

Ration Card Rules: ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉండవచ్చా? ఎవరు రేషన్ కార్డు పొందవచ్చు..? | Ration Card Rules: When can household members apply for a separate ration card

Ration Card Rules: ఒక ఇంటికి ఒక రేషన్ కార్డు. ఇది అందరి సాధారణ అభిప్రాయం. కానీ ఒకే ఇంట్లో చట్టబద్ధంగా ఒకటి కంటే ఎక్కువ కార్డులు పొందవచ్చని మీకు తెలుసా? పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం, అటువంటి కొత్త రేషన్ కార్డును ఎవరు పొందవచ్చు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ప్రత్యేక రేషన్ కార్డు ఎవరికి అవసరం? మీరు మీ కుటుంబంతో ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, మీకు సొంత ఆదాయం, ప్రత్యేక వంటగది, సొంత ఖర్చులు…

Read Full News

Watch: క్లాస్ జరుగుతుండగా అనుకోని అతిథి సడన్ ఎంట్రీ.. పరుగులు తీసిన విద్యార్థులు | Keesara School Cobra Scare: Students Flee Classroom, Parents Demand Safety in Medchal district

మేడ్చల్‌ జిల్లా: కీసరలోని సెరినిటీ స్కూల్‌లో నాగుపాము ప్రత్యక్షమవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలోని మూడో అంతస్తులో ఉన్న పదో తరగతి గదిలోకి పాము ప్రవేశించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీచర్‌ క్లాస్ నిర్వహిస్తున్న సమయంలో గదిలోకి నాగుపాము రావడాన్ని విద్యార్థులు గమనించారు. పామును చూసిన విద్యార్థులు భయంతో కేకలు వేస్తూ తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 45 నిమిషాల పాటు బయటే…

Read Full News

Weather Report: హమ్మయ్య వాన కబురు వచ్చింది.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్! | AP, Telangana Rain Alert: IMD Forecasts 3 Days of Showers Due to Bay Low Pressure

తెలుగురాష్ట్రాలకు వాతవారణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనంనెలకొని ఉందని.. సెప్టెంబర్ 11వ నాటికి పశ్చిమ మధ్య-వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతవారణ శాఖ తెలిపింది. ఉత్తర…

Read Full News

వార్నీ.. ఇంత ఈజీనా.. కల్తీ పాలను చిటికెలో కనిపెట్టండి.. వంటింటి సీక్రెట్ ట్రిక్స్ ఇవే.. | How to Check Milk Purity at Home: FSSAI Simple Detergent Test

కల్తీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి విడిగా విక్రయించే పాల కంటే, విశ్వసనీయ బ్రాండ్ల సీల్డ్ ప్యాకెట్లను ఎంచుకోవడమే మంచిది. ప్యాకెట్‌పై ఆకుపచ్చ FSSAI లోగో, 14 అంకెల లైసెన్స్ నంబర్, తయారీ, గడువు తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పక పరిశీలించాలి. రవాణా సమయంలో ఎండ వేడిమి వల్ల ప్లాస్టిక్ ప్యాకెట్లలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉన్నందున, వీలైనంత వరకు ఎక్కువ రక్షణ నిచ్చే గాలి చొరబడని టెట్రా ప్యాక్ పాల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ఆరోగ్యకరం.

Read Full News

ఉదయం టీ, కాఫీకి బదులుగా ఇది గిన్నెడు తింటే.. 100 ఏళ్ళు బలం.. కొండను పిండి చేసే శక్తి

టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు సత్తువనిచ్చే సగ్గుబియ్యం ఫూల్ మఖానా పాయసాన్ని గిన్నెడు తింటే చాలు. ఇది పోషకాలను అందిస్తూ, నొప్పులను దూరం చేస్తుంది. బెల్లం, పాలు, ఫూల్ మఖానా, సగ్గుబియ్యం కలయికతో తయారైన ఈ కమ్మని పాయసం ఐరన్, కాల్షియంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. డయాబెటిస్, బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం, పోషకాలతో కూడిన వంటకాలపై ఆసక్తి పెరుగుతున్న సగ్గుబియ్యం, ఫూల్ మఖానా పాయసం…

Read Full News

మెగా ఫ్యామిలీకి వెరీ గుడ్ టైం.. కొణిదెల సుస్మితకు కీలక పోస్ట్.. | Konidela sushmitha appointed special invitee indrakeeladri durga temple trust board

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మితకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సుస్మిత కొణిదెలను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు స్పెషల్ ఇన్వైటీగా(ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు, ఈవోకు అవసరమైన సందర్భాల్లో తన అనుభవంతో సుస్మిత సలహాలు ఇవ్వనున్నారు. ప్రధాన ఆలయ ఉత్సవాలు, జాతరల సమయంలో దేవస్థానం నిర్వహణకు సహకరించనున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి పలువురు వివిధ…

Read Full News

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ తప్పులు చేశారో..మీకు రీఫండ్‌ రాదు

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువు సమీపిస్తున్నందున, వేతన జీవులు ముందస్తు ప్రణాళికతో ఉండటం చాలా ముఖ్యం. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే ఫైల్ చేయడం వల్ల తప్పులు దొర్లకుండా ఉంటాయి, రీఫండ్ కూడా త్వరగా వస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన అంశాలపై స్పష్టత కలిగి ఉండాలి. ఉద్యోగులకు కంపెనీలు అందించే ఫామ్-16 ఐటీఆర్ ప్రక్రియను సులువు చేస్తుంది. అయితే, ఐటీ పోర్టల్ లో లభించే ఏఐఎస్ తో…

Read Full News

Virat Kohli One8: ఇది చూశారా? కోహ్లీ బ్రాండ్ బూట్లతో బరిలోకి పాక్ క్రికెటర్లు! దీని వెనుక ఉద్దేశం ఏంటి? | Pakistan women cricketers wear virat kohli one8 shoes asia cup nashra sandhu

Virat Kohli One8: మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్ స్పిన్నర్ నాష్రా సంధు ఆరు వికెట్లతో సంచలనం సృష్టించింది. హాంకాంగ్‌పై జట్టును గెలిపించిన ఆమె ఆట ఎంత చర్చనీయాంశమైందో, కాళ్లకు ధరించిన బూట్లు కూడా అంతే హాట్ టాపిక్‌గా మారాయి. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి చెందిన వన్8 బ్రాండ్ బూట్లతో పాక్ ప్లేయర్లు కనిపించడం నెట్టింట వైరల్ అవుతోంది. మహిళల ఆసియా కప్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో హాంకాంగ్ చైనాతో జరిగిన పోరులో పాకిస్థాన్ 72…

Read Full News