అమానుషం.. బెల్టుతో కొట్టి.. టవల్తో కట్టేసి.. నీట్ విద్యార్థినిపై సామూహికంగా..! | Madhya pradesh Neet student gang assaulted in devangana ghati chitrakoot suspects captured in cctv
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని పుణ్యక్షేత్రమైన చిత్రకూట్ సమీపంలోని దేవంగన లోయలో గుండెలను పిండేసే దారుణ సంఘటన వెలుగుచూసింది. రాజస్థాన్లోని కోటాలో నీట్ (NEET) కోచింగ్ తీసుకుంటున్న 20 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు ఉన్మాదులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని సత్నాకు చెందిన బాధితురాలు సెలవుల్లో ఇంటికి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తన 17 ఏళ్ల స్నేహితురాలి ఆహ్వానం మేరకు చిత్రకూట్కు వెళ్లింది. బుధవారం…